Telugu News Power

75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక

పాలకొల్లు: నవంబర్,26 (తెలుగు న్యూస్ పవర్)భారత రాజ్యాంగ 75 దినోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక లజపతిరాయ్ పేట లో గల అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించారు. స్థానిక మాంటిసోరి పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విద్యాసంస్థల అధినేత కలిదిండి కృష్ణ వర్మ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ రచన పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు…

Read More

అద్దేపల్లి కాలేజీ కుర్రాళ్ళు ’60 ల్లోoచి,20 ల్లోకి’

పాలకొల్లు: నవంబర్,25(తెలుగు న్యూస్ పవర్) అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల 1982 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చేనెల 13,14 శని,ఆదివారలలో 20వ పడిలోకి జారుకుని మళ్లీ కుర్రాళ్ళు కాబోతున్నారు. భీమవరం దగ్గర గల జక్కరం గ్రామంలోని రిసార్ట్స్ ఇందుకు వేదిక కానున్నది. గతంలో 2015 లో ఈ పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా జరిగింది. సెప్టెంబర్,5 గురుపూజోత్సవం రోజున జరిగింది. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో, వారికి చదువులు నేర్పిన గురువులను, ఎక్కడెక్కడి…

Read More

స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం.

పాలకొల్లు: నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక సుబ్బారాయుడు గుడి సెంటర్లో వేంచేసి ఉన్న, శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాహానిక దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండుగ జరిగింది. స్వామివారి వివాహ మహోత్సవం చెన్నుపాటి వెంకట శేష ప్రమోద్, చందు ప్రియ దంపతులుచే జరిపించారు. ఈ ఉత్సవాలు సోమవారం గణపతి పూజ, అంకురార్పణ మరియు ధ్వజరా ధ్వజారోహణం తో ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం పంచపాలిక పూజ, బలిహరణ జరిగింది. శ్రీ…

Read More

పాలకొల్లు చవాకుల ట్రస్ట్ కు ఇన్స్పైర్ అవార్డు

పాలకొల్లు:నవంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు చెందిన చవాకుల చారిటబుల్ ట్రస్ట్ 2025 సంవత్సరానికి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చవాకుల సూర్య నరేష్ ను విజయవాడలో ఘనంగా సత్కరించారు. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, సమాజానికి ఉత్తమ సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఏటా ఈ అవార్డు ప్రధానం చేస్తారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో నరేష్ ఈ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్…

Read More

ధర్మారావు ఫౌండేషన్ వెలుగులు

పాలకొల్లు:నవంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు వారి తండ్రి నిమ్మల ధర్మారావు పేరుతో నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఒక చిరు వ్యాపారి జీవితంలో వెలుగులు నింపింది. పూలపల్లి రంగరాజు రైస్ మిల్ ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాప్ లో ఈ వెలుగులు ప్రసరించాయి. కుక్కల సత్యనారాయణమ్మ ఈ షాపు నిర్వహించుకుంటున్నారు. రాత్రిపూట కూడా వ్యాపారం నిర్వహించుకోవడానికి అనువుగా తనకు ఒక ఛార్జింగ్ లైట్ ఇప్పించవలసిందిగా…

Read More

పడిపోయిన కొబ్బరి ధరలు రాలిపోయిన రైతు ఆశలు

పాలకొల్లు, యలమంచిలి, నవంబర్, 24 ( తెలుగు న్యూస్ పవర్)కొబ్బరి రైతులను ఊహల పల్లకిలో ఊరేగించిన కొబ్బరి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు, వ్యాపారులు ఇందువల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి ధర చిల్లర వ్యాపారస్తుల దగ్గర 35 నుంచి 40 రూపాయలు వరకు నడిచింది. రైతుకు 25 రూపాయలు వరకు ధర ముట్టింది. గత రెండు సంవత్సరాలుగా, నెమ్మదిగా పెరుగుతూ వచ్చి, గరిష్ట స్థాయికి చేరింది. అయితే ధర పతనం ఒక్క రోజులోనే కుప్పకూలిపోయినట్టు వ్యాపారులు…

Read More

క్షీరారామంలో చండీయాగం

పాలకొల్లు: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) క్షీరా రామలింగేశ్వర స్వామి వారి యాగశాలలో ఆదివారం చండీ హోమం జరిగింది. ఆడిటర్ రామరాజువారి కుమారులు బలరామరాజు దంపతులచే ఈ హోమం భక్తిశ్రద్ధలతో పురోహితులు సూరిబాబు ఆధ్వర్యంలో జరిపించారు. పలురువు భక్తులు ఈ హోమాన్ని వీక్షించారు.

Read More

మెడికల్ కాలేజీల పి పి పి విధానంపై చర్చకు రావాలి- జడ శ్రవణ్ కుమార్ సవాల్

పాలకొల్లు: నవంబర్, 23 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పి పి పి విధానం లో వైద్య కళాశాల ఏర్పాటు ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందో ప్రజలకు వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ న్యాయమూర్తి, జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాబోయే 17 వైద్య కళాశాలలు పి పి పి పద్ధతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణ…

Read More

భావిత తరాల కోసం నిరంతరం కష్టపడాలి మంత్రి నిమ్మల పిలుపు

యలమంచిలి: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మంత్రి మిమ్మల్ని రామానాయుడు పిలుపునిచ్చారు. యలమంచిలి మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ సభకు నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండి రాజకీయం కూడా చేయాలని కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి…

Read More

అయ్యప్ప భక్తులు ఉద్యమిస్తారు

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోలేదని బిజెపి నాయకులు, రైల్వే కమిటీ సభ్యులు జక్కంపూడి కుమార్ పత్రికలకు విడుదల చేసిన తన వీడియోస్ సందేశంలో హెచ్చరించారు. కోట్లాది రూపాయల అయ్యప్ప భక్తుల నిధులను అందుకుంటున్న కేరళ ప్రభుత్వం, వ్యాపారాలు చేసుకొనే వారికి ఎంతో సొమ్ము చెల్లిస్తున్నా,భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్వామిని దర్శించుకునే భక్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, చలికి వణుకుతూ…

Read More