మారేడు దళ ప్రదక్షిణలు చేసిన భక్తులు.
పాలకొల్లు: ఫిబ్రవరి, 16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వారు నిర్వహిస్తున్న, ఏడు మారేడు దళములు, ఏడు ప్రదక్షిణల సేవలో సోమవారం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించి తరించారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, భక్తులు పాల్గొన్నారు.