Telugu News Power

మారేడు దళ ప్రదక్షిణలు చేసిన భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వారు నిర్వహిస్తున్న, ఏడు మారేడు దళములు, ఏడు ప్రదక్షిణల సేవలో సోమవారం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించి తరించారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ చారిత్రాత్మక ప్రారంభోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి ఇలవేల్పు, కోరిన వారికి కొంగు బంగారం, మహిమగల తల్లి శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పునః నిర్మాణం, పూర్తి చేసుకుంటూ, బింబ, యంత్ర, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలుః మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉద్దండ పండితులు, బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ, యలమంచిలి నరేంద్ర శర్మ, బ్రహ్మత్వంలో ,ఈ విశేష పూజలు జరగనున్నాయి. ఈనెల 18 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. గణపతి…

Read More

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామోత్సవం నిర్వహించారు. రావణబ్రహ్మ వాహనంపై స్వామివారు పుర ప్రజలకు అనుగ్రహ దర్శనం చేశారు. ఈ ఊరేగింపులో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తలు బసవ సత్యనారాయణ, పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం తెల్లవారుఝామున 3గంటలకే తెరిచారు. దర్శనం కోసం భక్తులు 4 గంటల నుంచి విశేషంగా తరలివచ్చారు. ఉపవాస దీక్ష, జాగారం చేస్తూ చాలామంది భక్తులు ఆలయంలోనే ఉండిపోయారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, వివిధ ధార్మిక సంస్థల వారు త్రాగునీరు, ప్రసాదాలు అందజేశారు. లింగోద్భవ సమయంలో సరిగ్గా 12 గంటలకు అఖండ జ్యోతి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర…

Read More

సినీ నిర్మాత “అట్లూరి” అందరికీ ఆదర్శం.

హైదరాబాద్: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ కావాలి) సినీ నిర్మాత, అట్లూరి పూర్ణచంద్రరావుకు నవతి (90వ పుట్టినరోజు) మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీరు గేట్ కీపర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. కేవలం ఐదు రూపాయలు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా 87 సినిమాలు, 9 భాషల్లో నిర్మించారు. వీరు తీసిన సినిమాలు ఎన్నో చరిత్ర సృష్టించాయి. సినిమాకు, విజయాలతో పాటు, విలువలు చేర్చిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ఈయన సినీ ప్రస్థానం, ఎందరికో పాఠ్యపుస్తకం. లక్ష్యాలు…

Read More

మావుళ్ళమ్మ వారికి బంగారం బహూకరణ.

భీమవరం: ఫిబ్రవరి,14(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ నిధికి ఆరు గ్రాముల బంగారం శనివారం భక్తులు సమర్పించుకున్నారు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణనిధికి భక్తులు విరివిగా కనకపు కానుకలు సమర్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా, స్థానిక పుణ్య దంపతులు, కాసర బ్రహ్మాజీ రావు, శ్రీదేవి 4 గ్రాముల బంగారం, కన్నా బాలసుబ్రమణ్యం రాజు, అనూష 2 గ్రాముల బంగారం అమ్మవారికి కనకపు కానుక సమర్పించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు…

Read More

భక్తుల సేవే, భగవంతుని సేవ. – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

పాలకొల్లు: ఫిబ్రవరి,14(తెలుగు న్యూస్ పవర్) భక్తుల సేవే, భగవంతుని సేవగా భావించి అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. శివరాత్రి ఏర్పాట్ల పరిశీలనకు, శనివారం, కలెక్టర్ స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. దేవస్థానం వారు పూర్ణకుమంతో, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు, క్రిష్టప్ప, అనిల్ వేద ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామయ్య ధర్మకర్తల మండలి,అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, కలెక్టర్…

Read More

క్షీరారామం లో శ్రీ బాణ లింగ ప్రతిష్ట ‌

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, శుక్రవారం శ్రీ బాణ లింగ ప్రతిష్టాపన శ్రీ సుంగేశ్వరి పీఠాధిపతి ఆదేశముల మేరకు జరిగింది. అమరావతిలో ఉన్న, అమరలింగేశ్వర స్వామి వారి రక్షణ కొరకు, ద్రాక్షారామంలో వేంచేసి ఉన్న ద్రాక్షారామ లింగేశ్వరుడు సంరక్షించుటకుగాను శ్రీ బాణ లింగ ప్రతిష్ట జరిగినది. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా స్వామివారి సంరక్షణార్థం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుర…

Read More

మావుళ్ళమ్మ ను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.

భీమవరం: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) భీమవరం ఇలవేల్పు, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని, పోలీసు ఉన్నతాధికారులు గురువారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, పండితులు, ఐజీ, అశోక్ కుమార్, ఎస్ పి, అద్నాన్ నయీమ్ హస్మి లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరిరువురికి, వేద ఆశీర్వచన పూజలు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ చేయించారు. అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం, దేవాదాయ శాఖ, అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్…

Read More

పూలపల్లి మరకతలింగ మహాక్షేత్రం సందర్శించండి.

-గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) ఫూలపల్లి లో వేంచేసి ఉన్న, శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత అమృత లింగేశ్వర ఆలయాన్ని శివరాత్రి రోజు దర్శించి, తరించవలసినదిగా గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ, మాజీ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం, శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి…

Read More