Telugu News Power

భక్తులు అప్రమత్తంగా ఉండాలి. -నిర్వాహకుల విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అప్రమత్తతో ఉండాలని, తాళ్ళురి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. శిఖరంపై పూజాలు నిర్వహించడానికి తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి భక్తులు ఆ మెట్లపై నిలబడడం వల్ల బలం సరిపోక మెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది అమ్మవారికి, గ్రామానికి మంచిది కాదని తెలుసుకొని, భక్తులు…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, రెండో రోజు కుంకుమ పూజ, క్షీరాభిషేకం.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా, గురువారం కుంకుమ పూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాలు, శిఖరాలతో గ్రామ ప్రదక్షణ జరిగింది. విగ్రహాలకు భక్తులు పాలు,పూలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ జలాధివాసం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గవ్యాంతమార్జన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తుబలి, పర్యగ్నికరణం,…

Read More

శ్రీశ్రీ శ్రీ మూలస్తానేశ్వరి, వైభవంగా నూతన ఆలయ ప్రవేశ ప్రారంభోత్సవం.

యలమంచిలిని చల్లగా చూసే తల్లి, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ,యంత్ర శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి దుర్గాప్రసాద్ శర్మ ఆచార్యతంలో,బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం, వేదపఠం ఘోషతో వైభవంగా ప్రారంభమైంది. గణపతి ప్రార్థన, మంగళ వాయిద్యలతో ఆలయ, యాగశాల ప్రదక్షణం చేశారు. భూతబలి, విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన, ప్రోక్షనలు, ప్రాశనలు, ఋత్విక్ వరుణలు, దీక్షాధారణ, అఖండ జ్యోతి ప్రజ్వలన,…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశ పూజలు నేటి నుంచే.

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశానికి, నేటి నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవాలో భాగంగా మొదటి రోజు, ఉదయం గణపతి ప్రార్ధన మంగళ వాయిద్యములతో ఆలయ ప్రదక్షిణ, భూతబలి, విగ్నేశ్వర పూజతో మొదలై సాయంత్రం వరకు బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజలు రాత్రి వరకు కొనసాగుతాయి. అమ్మవారి ఆలయ తలుపులకు మంగళవారం…

Read More

మారేడు దళ ప్రదక్షిణలు చేసిన భక్తులు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయం వారు నిర్వహిస్తున్న, ఏడు మారేడు దళములు, ఏడు ప్రదక్షిణల సేవలో సోమవారం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించి తరించారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం శివాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ చారిత్రాత్మక ప్రారంభోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి ఇలవేల్పు, కోరిన వారికి కొంగు బంగారం, మహిమగల తల్లి శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పునః నిర్మాణం, పూర్తి చేసుకుంటూ, బింబ, యంత్ర, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలుః మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉద్దండ పండితులు, బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ, యలమంచిలి నరేంద్ర శర్మ, బ్రహ్మత్వంలో ,ఈ విశేష పూజలు జరగనున్నాయి. ఈనెల 18 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. గణపతి…

Read More

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం గ్రామోత్సవం నిర్వహించారు. రావణబ్రహ్మ వాహనంపై స్వామివారు పుర ప్రజలకు అనుగ్రహ దర్శనం చేశారు. ఈ ఊరేగింపులో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తలు బసవ సత్యనారాయణ, పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు, భక్తులు పాల్గొన్నారు.

Read More

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) శివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం తెల్లవారుఝామున 3గంటలకే తెరిచారు. దర్శనం కోసం భక్తులు 4 గంటల నుంచి విశేషంగా తరలివచ్చారు. ఉపవాస దీక్ష, జాగారం చేస్తూ చాలామంది భక్తులు ఆలయంలోనే ఉండిపోయారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, వివిధ ధార్మిక సంస్థల వారు త్రాగునీరు, ప్రసాదాలు అందజేశారు. లింగోద్భవ సమయంలో సరిగ్గా 12 గంటలకు అఖండ జ్యోతి ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర…

Read More

సినీ నిర్మాత “అట్లూరి” అందరికీ ఆదర్శం.

హైదరాబాద్: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ కావాలి) సినీ నిర్మాత, అట్లూరి పూర్ణచంద్రరావుకు నవతి (90వ పుట్టినరోజు) మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. వీరు గేట్ కీపర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. కేవలం ఐదు రూపాయలు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నిర్మాతగా 87 సినిమాలు, 9 భాషల్లో నిర్మించారు. వీరు తీసిన సినిమాలు ఎన్నో చరిత్ర సృష్టించాయి. సినిమాకు, విజయాలతో పాటు, విలువలు చేర్చిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ఈయన సినీ ప్రస్థానం, ఎందరికో పాఠ్యపుస్తకం. లక్ష్యాలు…

Read More

మావుళ్ళమ్మ వారికి బంగారం బహూకరణ.

భీమవరం: ఫిబ్రవరి,14(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ నిధికి ఆరు గ్రాముల బంగారం శనివారం భక్తులు సమర్పించుకున్నారు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణనిధికి భక్తులు విరివిగా కనకపు కానుకలు సమర్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా, స్థానిక పుణ్య దంపతులు, కాసర బ్రహ్మాజీ రావు, శ్రీదేవి 4 గ్రాముల బంగారం, కన్నా బాలసుబ్రమణ్యం రాజు, అనూష 2 గ్రాముల బంగారం అమ్మవారికి కనకపు కానుక సమర్పించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు…

Read More