Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మకు ఊయల సేవ.

భీమవరం: జూలై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్ఠమాస మహోత్సవాలు ముగింపు రోజు సందర్భంగా, సోమవారం శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల నుంచి వైభవంగా జరిగింది.దేవస్థానం సంప్రదాయం ప్రకారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు కి పుట్టింటి,అత్తింటివారు గా వ్యవహరించే అల్లూరి వారు, మెంటే వారి వంశస్థులచే విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు….

Read More

భద్రాచలం రామచంద్రస్వామి ఆలయ ఉత్తర ద్వారం తొలగింపు.

భద్రాచలం: జూలై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర ద్వారం తలుపులతో పాటు 2010లో నిర్మించిన ఇనుప వంతెనను అధికారులు సురక్షితంగా సోమవారం తొలగించారు. గత3 రోజులుగా భూ పరీక్షలు నిర్వహించిన అనంతరం, కట్టుదిట్టమైన భద్రత మధ్య పనులు చేపట్టారు. ఆలయ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Read More

మాస శివరాత్రికి, మహాశివరాత్రిలా పోటెత్తిన భక్తులు.

పాలకొల్లు: జులై,13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాస శివరాత్రి సందర్భంగా, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం సోమవారం భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు అందనంతగా, వేల సంఖ్యలో పంచారామ క్షేత్ర దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రాత్రి 8:30 గంటల వరకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు కోసం భక్తులు బారులు తీరారు. నిత్య అన్నదాన పథకంలో భాగంగా సుమారు 1500 మంది భక్తులు…

Read More

పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో పరామర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు.

ముంబై: జూలై,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కుడి భుజానికి శాస్త్ర చికిత్స జరిగిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పరామర్శించారు. స్థానిక కోకిలబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ఆదివారం కలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ శాస్త్ర చికిత్స జరిగిన విధానాన్ని వారికి వివరించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజెనోవా సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరి నారాయణ, రెవిన్యూ శాఖ…

Read More

క్షీరా రామంలో లీలా కళ్యాణం.

పాలకొల్లు: జూలై,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్ర హోమం నిర్వహించారు. రాత్రి స్వామివారి సన్నిధిలో గల కళ్యాణమండపం లో లీలా కళ్యాణం నిర్వహించారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు వివేక్షణలో భక్తులు రుద్ర హోమం, లీలా కళ్యాణం పూజలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ. లక్ష విరాళం.

భీమవరం: జూలై,12(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భీమవరం కి చెందిన జక్కంశెట్టి హరీష్, కొంకిపూడి కిరణ్ లక్ష రూపాయలు విరాళం గా అందజే సారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న జే సీ కల్ప శ్రీ

భీమవరం: జులై, 10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం, నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కె.ఆర్ కల్ప శ్రీ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించి శేషవస్త్రం తో సత్కరించారు.పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్…

Read More

శ్రీ మావుళ్ళమ్మను దర్శించుకున్న కేరళ డిజిపి దంపతులు.

భీమవరం: జూలై,9( తెలుగు మూవీస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పుఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డి జి పి, రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలునిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి వీరికి శేషవస్త్రం ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో జరిగే చండీ హోమానికి భక్తులు తరలి రావాలి.

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రముఖ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ నెల 14న మంగళవారం ఉదయం 7 గంటలకు, అత్యంత వైభవంగా మహా చండీ హోమం జరుగుతుంది.. అమావాస్య తిథి దైవారాధన, దుష్టశక్తుల నివారణ, శాంతి, ఐశ్వర్య ప్రాప్తికి అత్యంత పవిత్రమైనదని ఋషులు నిర్ధారించారు,ఈ పుణ్యదినాన నిర్వహించే చండీ హోమం ద్వారా దుర్గాదేవి అనుగ్రహం…

Read More

నేలకొరిగిన దేవతా వృక్షం. ఆలమూరు కలవ పువ్వు వేపచెట్టు. తనువు చాలించిన శతాధిక తరువు.

పెనుమంట్ర: జూలై, 5( తెలుగు న్యూస్ పవర్. కామ్) దాదాపు 60 ఏళ్ల క్రితం అద్భుతం జరిగింది. వేలాదిమంది ఈ వింత చూడటానికి ఆరోజు ఎగబడ్డారు. మార్టేరు సమీపానగల ఆలమూరు గ్రామంలో ఈ సంఘటన నాడు చోటుచేసుకుంది. నేటి శివాలయం ఎదురుగా ఉన్న వేప చెట్టుకు కలువ పువ్వు మాదిరిగా వేప చెట్టు కాండం పైన కొంత భాగం విస్తరించింది. గ్రామస్తులు లక్ష్మీదేవి తమ గ్రామానికి వచ్చిందని, అందుకే వేప చెట్టుపై అధిష్టించినట్టు భావించి పూజలు చేయడం…

Read More