Telugu News Power

నేటి నుంచి పంచాయతీల లో ప్రత్యేక అధికారుల పాలన.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో కి వస్తుంది. ఇంతవరకు సాగిన సర్పంచ్ ల పాలన గురువారంతో ముగిసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నెం.47 విడుదల చేసింది. ప్రభుత్వం ఇంతకుముందే చెక్కు పవర్ వద్దు ఉత్తర్వులు వెలువరించింది. ప్రత్యేక అధికారుల పాలన ప్రజలకు అందుబాటులో ఉండటం సమస్య కావచ్చునని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక అధికారులుగా ఎంపీడీవో, ఎమ్మార్వో, వ్యవసాయ అధికారి, పశువైద్యాధికారి, విద్యాశాఖ అధికారీ ఆయా మండలాల్లో…

Read More

నాసా ఆర్ట్మిస్ II అంతరిక్ష ప్రయోగం విజయవంతం.

ఫ్లోరిడా: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్)అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ,నాసాచేపట్టిన ఆర్టెమిస్-II ప్రయోగం విజయవంతంగా ప్రారంభమై, మానవ అంతరిక్ష చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఆర్టెమిస్-II ప్రయోగం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 2026 ఏప్రిల్ 1న సాయంత్రం నాసా అత్యాధునిక అంతరిక్ష యానం వ్యవస్థ, (ఎస్ ఎల్ ఎస్) రాకెట్ ద్వారా ఆర్టెమిస్-II మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. నాసా ప్లస్ వన్ ఈ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు…

Read More

అజరామరం రాజధాని అమరావతి.

న్యూఢిల్లీ/అమరావతి: ఏప్రిల్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, సవరణ బిల్లు, 2026ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ, అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీర్ఘకాల లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా,…

Read More

చేనేతకు 150 కోట్ల విద్యుత్ ఉచితం.

పాలకొల్లు: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి, సంక్షేమ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చేనేతకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక భగ్గేశ్వరంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు, కూటమి ప్రభుత్వం బీసీలకు, ముఖ్యంగా చేనేతకారులకు అండదండలు అందిస్తుందని నిమ్మల తెలిపారు. చేనేత మగ్గం ఉన్న 93 వేల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత…

Read More

ఘనంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దివ్య కళ్యాణం.

ముత్యాలతలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భువనేశ్వరి దంపతులు. ఒంటిమిట్ట: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్ . కామ్) ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం, శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ రామచంద్రుడు, సీతామ్మ వారి దివ్య వివాహం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తి శ్రద్ధలతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఏకసిలా నగరం ఎల్లెఎడల, శ్రీ రామ నీ నామెంతో రుచిరా అంటూ మారు మోగిపోయింది.రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన…

Read More

విశాఖ కలెక్టర్ గా కిషోర్.

విశాఖపట్టణం: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్.కాం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా, విశాఖ జిల్లా కలెక్టర్ గా ముట్టింబాకు అభిషిక్త్ కిషోర్, ఐఏఎస్ నియమితులయ్యారు. విశాఖ కలెక్టర్ కార్యాలయ చాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఈ స్థానంలో పనిచేసిన, హరేంధిర ప్రసాద్ కాకినాడ కలెక్టర్ గా బదిలీపై వెళ్ళారు.

Read More

హరేంధిర ప్రసాద్ కాకినాడ కొత్త కలెక్టర్.

కాకినాడ: ఏప్రిల్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) హరేంధిర ప్రసాద్ కాకినాడ కొత్త కలెక్టర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, ఆర్డీవో ఎస్ మల్లిబాబు, కమిషనర్ సత్యనారాయణ, డిఆర్ఓ తిప్పే నాయక్ తదితర అధికారులు కొత్త కలెక్టర్ కు స్వాగతం పలికారు. కాకినాడ జిల్లా పరిస్థితులపై తనకు అవగాహన ఉందని, పూర్తి ప్రభుత్వ సమాచారం సేకరించి ముందుకు అనుగుణంగా అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల సహాయసహకారాలతో కాకినాడను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో…

Read More

ఫిషింగ్ హార్బర్ కు రూ.72.42 కోట్లు మంజూరు.

కాకినాడ: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేస్తున్నట్టు స్థానిక ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. మత్స్యకార సోదరుల అభ్యున్నతికి సంబంధించి నిధుల కోసం, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, తరచూ సంబంధిత శాఖ అధికారులతో చర్చలు జరిపానన్నారు. ఫలితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు కేంద్రం రూ.72.42 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మత్స్యకార సోదరసోదరీమణుల ఉన్నతికి ఈ నిధులు…

Read More

అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకే చెబుతా. -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాత పాలనాదక్షుడిగా కీర్తించబడిన, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రభుత్వ పాలన యంత్రాంగం పట్టు తప్పిందని, తన మాట చెల్లుబాటు కావటం లేదని, ఓ సందర్భంలో, ముఖ్యమంత్రేం స్వయంగా వాపోయారు. గతంలో ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో, ప్రజల ముందు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన సందర్భంగా ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇది మంచి…

Read More

నేను రాను నరసాపురానికి, అరుణాచలానికి ఆగిన రైలు కూత.

విజయవాడ:మార్భి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక వూడిన చందంగా తయారయింది అరుణాచలం రైలు ప్రయాణం. గత కొంతకాలంగా భక్తులు విశేషంగా దర్శిస్తున్న, అరుణాచలం యాత్రకు పచ్చ సిగ్నల్ లేక ఆగిపోయింది. నరసాపురం నుంచి బయలుదేరే ఈ రైలు ప్రయాణం తిరువణ్నమలై వరకు సాగుతుంది. భక్తులకు ఈ ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉండటం వల్ల, పలు జిల్లాల భక్తులు రిజర్వేషన్ కోసం పోటీ పడుతున్నారు. ఏడాదిన్నరగా, రెండు నెలలకు ఒకసారి రైల్వే అధికారులు…

Read More