Telugu News Power

శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా ఆదిశంకరుల జయంతి ఉత్సవం.

భీమవరం: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో బుధవారం ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవం జరిగింది. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేవస్థాన మండపంలో ఏర్పాటు చేసిన విశేష కార్యక్రమం లో శ్రీ ఆదిశంకరుల చిత్రపటానికి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో దేవస్థానం వైదిక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిశంకరాచార్యులు కేవలం 32 ఏళ్ళ స్వల్ప కాలంలోనే…

Read More

జలవనురుల నిధులు రూ. 3 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ట, కొమ్ము చిక్కాల, కాపవరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. అరట్లకట్టలో రూ. 50 లక్ష్యంతో సీసీ వాల్ నిర్మాణం, రూ. 20 లక్షలతో పైపు కల్వర్టు, గ్రావెల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొమ్ముచిక్కాల లో రూ.75 లక్షలతో సి సి వాల్ నిర్మాణం,రూ.31.29 లక్షలతో మరో సిసి వాళ్ళ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కాపవరం…

Read More

పాలకొల్లుకు రూ. 5 కోట్లతో వ్యర్ధాల నిర్వహణ ప్రాజెక్టు.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ కావాలి. కామ్) వ్యర్ధాల నిర్వహణకు సంబంధించి ఆధునిక ప్రాజెక్టు ఐదు కోట్ల రూపాయలతో పాలకొల్లులో ఏర్పాటు చేయనున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, పట్టాభిపురం మంగళవారం పాలకొల్లులో ఎడ్ల బజారు వద్ద, సూర్య తేజ శివారుణ ఉన్న డంపింగ్ యార్డ్లను పరిశీలించారు. వ్యర్ధాల నిర్వహణ ఎప్పటికీ చాలా వరకు పూర్తయిందని, ఇంకా 57,600 మెట్ ట్రిక్ టన్నుల బయో…

Read More

బూరుగుపల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లి గ్రామంలో ఈనెల 16న రాత్రి నూకాలమ్మ జాతరలో జరిగిన హత్య, మరొకరిపై హత్యా ప్రయత్నం పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం అరెస్టు చేసినట్టు పోలీసులు వివరాలు వెల్లడించారు. దేవరపు వీరస్వామి అనే వ్యక్తి జనసమూహంలో జాతర చూస్తుండగా నిందితులు కారుతో ఢీ కొట్టి అతని మరణానికి కారణం అయ్యారు. ఈ దాడిలో మౌనం శ్రీరామ్ కృష్ణ పై కూడా హత్యాయత్నం…

Read More

శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల.

పాలకొల్లు: ఏప్రిల్, 21 (తెలుగు మూవీస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా, ఆమె మాట్లాడుతూ, మార్చి 26 నుండి ఏప్రిల్ 8 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 4 వ సెమిస్టర్‌లో మొత్తం 197 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 192 మంది…

Read More

కంటి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమ

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎస్.ఎమ్. ప్రభుత్వ అటానమస్ కళాశాల నందు ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 1,2, హెల్త్ కేర్ సెంటర్, రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు పాలకొల్లు ఆర్.ఆర్. లయన్స్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘డ్రై ఐ సిండ్రోమ్’ (కళ్లు ఆరిపోవడం) అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు…

Read More

చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు. -మాదే ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవ‌ల వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు చూస్తుంటే బాగా భ‌య‌ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోందని, వైసిపి అధినేత,మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా మంగళవారం పేర్కొన్నారు. ఎన్నిక‌ల ముందు అధికారం కోసం నోటికి వ‌చ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూప‌ర్ సిక్స్‌, సూప‌ర్ సెవెన్ అంటూ ప్ర‌తి స‌భ‌లోనూ ఊద‌ర‌గొట్టారు. బాండ్లు సైతం ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్ర‌తి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పిన‌వి ఏవీ చేయ‌క‌పోగా, సూప‌ర్ సిక్స్,…

Read More

క్షీరా రామంలో శంకర జయంతి.

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి వారి కళ్యాణ మండపంలో ఉన్న ఆది శంకరాచార్యుల విగ్రహం వద్ద ఉదయం మండపారాధన, అష్టోత్తరము పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన…

Read More

పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం.

హైదరాబాద్: ఏప్రిల్ 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగువారి అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం అయ్యిందని అపోలో ఆసుపత్రి వర్గాలు మంగళవారం విడుదల చేసిన వైద్య బులిటిన్ లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో సైనసైటిస్ (ముక్కు/సైనస్ సమస్య) కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు నిర్వహించిన “ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఎఫ్ ఇ ఎస్ ఎస్)”. ఇది ఎండోస్కోపీ ద్వారా ముక్కు లోని సైనస్…

Read More

పెదపేట రామాలయానికి ఆకివీడు నగరపాలక సంస్థ ఆమోదముద్ర.

ఆకివీడు: ఏప్రిల్ ,21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెదపేట లో రామాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి మంగళవారం తొలి అడుగు పడింది. స్థానిక నగర పంచాయతీ వారు ఆలయ నిర్మాణానికి అవసరమైన తీర్మానం ఆమోదించారు. నగర పంచాయతీ కార్యాలయంలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో తీర్మానం ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు 20 మందిలో 19 మంది తీర్మానాన్ని ఆమోదించారు. కౌన్సిలర్ జోష్న ఒక్కరే ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు. కౌన్సిల్లో…

Read More