Telugu News Power

నేడే యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు.

భీమవరం: (తెలుగున్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51 వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయని, సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. గుంటూరు ఏసీ కళాశాల లో రెండు రోజులు పాటు ఈ మహాసభలు జరుగుతాయి. యుటిఎఫ్ స్వర్ణోత్సవాలు పూర్తి చేసుకుని, కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నది. ఈ సందర్భంగా జరిగే సభలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ, బొర్ర గోపి మూర్తి, మాజీ…

Read More

అక్రమ మద్యంపై ఉక్కుపాదం -సిఐ మద్దాల శ్రీనివాస్.

అక్రమ మద్యం అమ్మకాలు, రవాణా, త్రాగడం వంటి చర్యలను ఉక్కుపాదంతో అనచివేస్తామని, పాలకొల్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మద్దాల శ్రీనివాస్, గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇందుకు సంబంధించి గతంలో ముద్దాయిలు సుమారు 20 మందిని బైండోవర్ చేశామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం తెచ్చి, అమ్మకాలు చేస్తే, నేరస్తులతో పాటు, ఆయా వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. పండుగ ప్రశాంతంగా, కల్తీ మద్యం బారిన పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో వంటలు ప్రదర్శన.

పాలకొల్లు: జనవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, ప్రభుత్వ కళాశాలలో, సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా, గురువారం సాంప్రదాయ వంటకాల ప్రదర్శన జరిగింది. కళాశాల సాంస్కృతిక విభాగం ఈ పోటీలు నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలు, కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, చిన్న గోపురం చైర్మన్, రేపాక ప్రవీణ్ భాను, డాక్టర్ సిరిగినీడి రంగారావు, నిమ్మకాయల సత్యనారాయణ, టి కృష్ణ, బూసి వెంకటస్వామి, ఆశ…

Read More

నేడే ఛాంబర్స్ కాలేజీలు పండుగ సంబరాలు

పాలకొల్లు: డిసెంబర్, 8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో శుక్రవారం ఉదయం నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. పండుగ సంప్రదాయం ప్రకారం భోగి మంటలు, గంగిరెద్దుల వారి ఆట,కోలాటం భజన,గరగ నృత్యాలు, హరిదాసు కీర్తనలు, పిండి వంటలు తయారీ, విద్యార్థులచే విద్యార్థులచే నృత్య ప్రదర్శన వంటి వివిధ సాంస్కృతి కార్యక్రమాలతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు,వ్యాపార సంఘాల వారు, పుర ప్రజలు విచ్చేసి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా,సంక్రాంతి…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ముగ్గుల పోటీలు

పాలకొల్లు: జనవరి, 8(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు గురువారం, ముగ్గుల పోటీల్లో 175 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ముగ్గురు పోటీల న్యాయనిర్నేతలుగా. ఏ. విశాల లక్ష్మి, రేపాక శ్రీ చిత్ర, కారుమూరి సబిత, సింధు వ్యవహరించారు. విద్యార్థులు, కాలేజీ ప్రాంగణం అంతా, తమ ముగ్గులతో పండుగ వాతావరణం లో, సందడి చేశారు. విద్యార్థుల ప్రతిభ న్యాయ నిర్ణయతలను అబ్బురపరిచింది. విద్యార్థులను, సర్టిఫికెట్లు మెడల్స్ తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల…

Read More

ఉద్యమాల జెండా రెపరెపలాడాలి-ఎమ్మెల్సీ గోపి మూర్తి

భీమవరం: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉద్యమాల జెండా ఎప్పుడూ, రెపరెపలాడుతూనే ఉండాలని, ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఎన్నికల సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరై గోపి మూర్తి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్జీవో కార్యవర్గాల నిర్మాణం పూర్తయిన తర్వాత, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని మేల్కొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం తగ్గిందన్నారు….

Read More

పాలకొల్లు సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం.

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పుష్కర కాలంగా, నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు,ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు వెల్లడించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో, సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి ముగ్గుల పోటీతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలకొల్లు లో ఈ నెల 9న, యలమంచిలిలో 10న…

Read More

టెట్ పరీక్ష పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,ఉపాధ్యాయుల పక్షాన పోరాడాలి.

అమరావతి: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయులను కలవరపెడుతున్న టెట్ పరీక్ష రద్దు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయపోరాటం ప్రారంభించాలని జాక్టో డిమాండ్ చేసింది. జాక్టో నాయకులు, కత్తి నరసింహారెడ్డి, నక్క వెంకటేశ్వర్లు, లంకపల్లి సాయి శ్రీనివాస్, బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2010కి ముందు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులను, టెట్ పరీక్ష నుంచి మినహాయించడానికి, న్యాయపరమైన, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పరీక్షలు రద్దు చేయాలని 7 ప్రముఖ సంఘాల ఐక్యవేదిక జాక్టో…

Read More

పేరు నమోదుకు ఆఖరి అవకాశం

పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, పేరు నమోదుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది జనవరి, 20 నాటికి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి, వారి పేరుతో జనన ధ్రువ పత్రం పొందటానికి గడువు, ఈ నెల 21తో ముగుస్తుంది. ఇప్పటికీ పేరు నమోదు చేసుకోని వారు స్థానిక మున్సిపల్ కార్యాలయం, జనన మరణ నమోదు కేంద్రం వద్ద వివరాలు అందించి, జనన ధ్రువపత్రం, పేరుతో సహా పొందవచ్చునని,…

Read More

ఎమ్మెల్సీ గోపి మూర్తి సేవలకు గుర్తుగా క్యాలెండర్.

భీమవరం: డిసెంబర్,7(తెలుగు న్యూస్ పవర్) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సంఘం తరఫున, వినూతన కార్యక్రమాలు చేపడుతున్న కాళ్ళ మండల శాఖను ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి అభినందించారు. ఎమ్మెల్సీగా పదవి చేపట్టి, తొలిఏడాది విజయవంతంగా, సేవలుపూర్తి చేసుకున్న సందర్భానికి గుర్తుగా, కాళ్ల మండల శాఖ క్యాలెండర్ రూపొందించారు. తన పేర ముద్రించి, సభ్యులకు కానుకగా ఇస్తున్న క్యాలెండర్ను గోపి మూర్తి స్వయంగా, భీమవరం జిల్లా కార్యాలయం నందు బుధవారం ఆవిష్కరించారు. యుటిఎఫ్ నాయకులు, పి.ఆరోగ్య స్వామి, పి.ఫిలిప్స్…

Read More