Telugu News Power

త్యాగధనుడు పోలిశెట్టి ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి

పాలకొల్లు: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ ఉద్యమం కోసం, కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగదనుడు, అమరజీవి ఎస్ ఆర్ పోలిశెట్టి అని, ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి, నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్ ఆర్ పోలిశెట్టి 25వ ఉమ్మడి జిల్లా వ్యాప్త,వర్ధంతి సభ, మంగళవారం రాత్రి,, స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, దాసరి నారాయణరావు వేదిక వద్ద జరిగింది. ఈ సభకు బోర్ర గోపి మూర్తి ముఖ్య…

Read More

చిరంజీవి సినిమా టికెట్ ధర లక్ష పదహారు వేలు

అమలాపురం: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “మన శివశంకర వరప్రసాద్” సినిమా టికెట్ ధర, కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. స్థానిక అమలాపురం, వెంకటరమణ థియేటర్ వద్ద మంగళవారం ఈ సినిమా టికెట్ వేలం జరిగింది. రాష్ట్ర బిజెపి నాయకులు మోకా వెంకట సుబ్బారావు లక్ష 16 వేల రూపాయల వేలంలో ఈ టిక్కెట్టు రాష్ట్రంలోనే అత్యధిక ధర చెల్లించి దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం…

Read More

‘గోపిశెట్టికి’ సన్మానం

పాలకొల్లు: డిసెంబర్, 6(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల జాతీయస్థాయి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కు ఎంపికైన లంకలకోడేరుకు చెందిన గోపిశెట్టి కవిత బేబీని పెన్షనర్లు సత్కరించారు. స్థానిక పెన్షనర్ల భవనం, తమ్మినీడి సుబ్బారావు హాల్లో, మంగళవారం, కార్యదర్శి డాక్టర్ ప్రతాప్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరిగింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వంగ నరసింహా రావు అధ్యక్షుత వహించారు. ఈ సందర్భంగా పలువురు, విశ్రాంత ఉద్యోగులు, బేబీని ఆశీర్వదించి, అభినందించారు. ఉద్యోగంలో వచ్చే వడిదుడుకులను…

Read More

లక్ష్మీ గణపతి హోమం

పాలకొల్లు: జనవరి, 6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఏడు వారాలు, మారేడు దళ సప్త ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులు విగ్నేశ్వర స్వామి వారి పూజ, శివ సహస్రనామం పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు.

Read More

మోరి ఫీల్డ్ లో ఓఎన్జిసి బ్లోఅవుట్ మంటలు

న్యూఢిల్లీ:జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) మోరి ఫీల్డ్ లో ఇరుసుమండ వద్ద చోటు చేసుకున్న అడ్వాన్స్ డీప్ ఇండక్షన్ గ్యాస్ లీక్ సంఘటనను, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్,ఓఎన్జిసి విజయవంతంగా నియంత్రించినట్లు ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఓఎన్జిసి పేర్కొంది. ప్రమాదం గుర్తించిన వెంటనే అత్యవసర చర్యలు చేపట్టి పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకువచ్చినట్టు ఓఎన్జిసి వెల్లడించింది. ఈ ఘటన సమయంలో సుమారు 600 మీటర్ల పరిధిలో, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్టు…

Read More

విద్యార్థులు చదువుతోపాటు ఉపాధి నైపుణ్యాలు నేర్చుకోవాలి – డాక్టర్ బాబ్జి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు గల నైపుణ్యాలు నేర్చుకోవాలని, ప్రముఖ వైద్యులు, విద్యావేత్త, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం మైక్రో గ్రీన్ కల్చర్, మరియు ఫ్యాబ్రిక్ బ్యాగ్ మేకింగ్ నేర్చుకోవడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మైక్రో గ్రీన్ వంటి మొక్కలు పెంపకం, ఆరోగ్యంతో…

Read More

అమెరికాలో ప్రమాదం పాలకొల్లులో విషాదం

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కొటికలపూడి రాజమోహన్రావు కుటుంబ సభ్యులు, కిన్నెర కూల్ డ్రింక్స్ అధినేత తాతాజీ కుమారుడు, కృష్ణ కిషోర్ (51) (టిన్ను), కోడలు ఆశ కన్నా అమెరికాలోని, వాషింగ్టన్ నగరంలో ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మరణించినట్టు సమాచారం వచ్చింది. ఈ దంపతులు, తమ సంతానం శివాని, సుచయ్ కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ట్రక్ ఢీ కొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలియవచ్చింది. ప్రమాదంలో…

Read More

సంక్రాంతి లోపు వరి నాట్లు వేయాలి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) రైతులు, పండగ లోపు వరి నాట్లు పూర్తి చేయాలని, పాలకొల్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ సూచించారు. మండలంలోని శివదేవుని చిక్కాల, దగ్గులూరు, బల్లిపాడు, లంకలకోడేరు, ఆగర్రు, గ్రామాల్లో సోమవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. మండలంలో దాళ్వా 9750 ఎకరాల్లో సాగుఅవుతుంది. ఇప్పటివరకు 1650 ఎకరాలలో నాట్లు వేశారు. నీటి కొరత లేకుండా దాల్వాపంట పండించడానికి, ఏప్రిల్ లోపు కోతకు వచ్చేలా రైతులు ప్రణాళిక వేసుకోవాలని కోరారు. ప్రస్తుతం మండలంలో…

Read More

లక్ష చామంతి పూజ

యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయంలో ఆదివారం గణపతి హోమం, స్వామివారి అభిషేకం, లక్ష చామంతి, తులసి పూజ జరిగింది. వెంప పండితులు సూరిబాబు, అర్చకులు వాడపల్లి కృష్ణమాచార్యులు వారి బృందం ఈ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ఆంజనేయులు, ధర్మకర్తలు, వంటిపల్లి ప్రసాద్, పలువురు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతోఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

సావిత్రిబాయి పూలే జయంతి సమావేశం

పాలకొల్లు: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) భారత స్త్రీకి విద్య ద్వారా బంధనాలనుంచి ముక్తి కలిగించాలని పూనుకున్న జ్యోతిబాయ్ పూలే, జయంతి సందర్భంగా,ఆదివారం, స్థానిక వైష్ణవి టెక్నో హైస్కూల్లో, ఎలమంచిలి మండల శాఖ ఈ సమావేశం నిర్వహించారు. సావిత్రిబాయి, చేసిన పోరాటాలను, ఎదుర్కొన్న కష్టాలను, స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత విశేషాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బి శైలజ అధ్యక్షత వహించారు. డి పద్మావతి, ఎస్ డి పాలేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యుటిఎఫ్, యలమంచిలి…

Read More