Skip to main content

Telugu News Power

లక్ష్మీ గణపతి హోమం

లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: జనవరి, 6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఏడు వారాలు, మారేడు దళ సప్త ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులు విగ్నేశ్వర స్వామి వారి పూజ, శివ సహస్రనామం పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు.