Telugu News Power

డిజిటల్ టెక్నాలజీతో 8వ జనగణన.

అమరావతి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. భారతదేశంలో జరిగే 16వ జనాభా లెక్కల గణన ఇది. స్వాతంత్ర భారతదేశంలో 8వ జనగణన. వచ్చే ఏడాది ఈ జనగణన ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోకూడా జనాభా లెక్కల సేకరణకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే. విజయానంద్ స్థానిక సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారుల(కలెక్టర్ల)తో శుక్రవారం సన్నాహక…

Read More

ఉచిత కంటి పరీక్షల శిబిరం

పాలకొల్లు: స్థానిక శ్రీ ఏ. ఎస్.ఎన్. ఎం. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్,ఎన్‌సి‌సి యూనిట్ మరియు అమరావతి కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ ప్రధాన అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా కంటి ఆరోగ్యం విద్యాభ్యాసంలో కీలక పాత్ర పోషిస్తుందని…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ప్రతిభ

పాలకొల్లు ఆర్ టి ఐ హెచ్- సీసీఈ ఇన్నో ట్రై కార్యక్రమంలో స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్టార్ తప్పు మైండ్ సెట్, ఇంట్రడక్షన్ టు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ కోర్సులు పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలో కోర్సు పూర్తి చేసుకున్న వారిలో 10మంది, ఏ ఎస్ ఎన్ ఎం. కళాశాల వారు ఉండటం పట్ల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, విద్యార్థులను గురువారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా…

Read More

తహశిల్దార్ కార్యాలయం వద్ద విఆర్వోల నిరసన.

యలమంచిలి: ఫిబ్రవరి, 19 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వీఆర్వోల నిరసన కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండల వీఆర్వోలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. జనవరి 12 నుంచి వర్కు టు రూల్ పాటించాలని సంఘం నిర్ణయించింది. వీఆర్వోలు రాత్రి పగలు తేడా లేకుండా బాధ్యతలు నిర్వహించవలసి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇందువల్ల కొందరు ప్రమాదాలకు గురవుతుంటే, మరి కొందరు ఆత్మహత్యలు పాల్పడ్డ…

Read More

రైల్వేవారు దారి వదలాలి రైతులు విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటు గురించి సేకరించిన భూమిలో రైల్వే వారు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏనుగువానిలంక,కలగంపూడి మధ్య ఉన్న 7 ఎకరాలు భూసేకరణలో రైల్వే వారు తీసుకున్నారు. దీనికి సంబంధించి రైతులకు సొమ్ము కూడా అప్పుడే చెల్లించారు. రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు ఇంతవరకు సజావుగా నిర్వహించుకుంటున్నారు. దాళ్వాపంట మాసూళ్లకువస్తున్న సమయంలో కంచ ఏర్పాటు చేయడం వల్ల రైతుల రాకపోకలకు అడ్డంకి ఎదురవుతుందని రైతులు…

Read More

భక్తులు అప్రమత్తంగా ఉండాలి. -నిర్వాహకుల విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అప్రమత్తతో ఉండాలని, తాళ్ళురి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. శిఖరంపై పూజాలు నిర్వహించడానికి తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి భక్తులు ఆ మెట్లపై నిలబడడం వల్ల బలం సరిపోక మెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది అమ్మవారికి, గ్రామానికి మంచిది కాదని తెలుసుకొని, భక్తులు…

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి, రెండో రోజు కుంకుమ పూజ, క్షీరాభిషేకం.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా, గురువారం కుంకుమ పూజ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహాలు, శిఖరాలతో గ్రామ ప్రదక్షణ జరిగింది. విగ్రహాలకు భక్తులు పాలు,పూలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ జలాధివాసం కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గవ్యాంతమార్జన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తుబలి, పర్యగ్నికరణం,…

Read More

ఏటిగట్టు పనులతో ప్రమాదం -పాలకొల్లు వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆరోపణ

యలమంచిలి: ఫిబ్రవరి,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానికంగా జరుగుతున్న ఏటిగట్టు పనులు ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆరోపించారు. ఏటిగట్టు పక్కనే ఉన్న మట్టి తవ్వి, పైకి వేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ గట్టు బలం లేక కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏటిగట్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని గోపి బుధవారం పరిశీలించారు. ఏటిగట్టు పనులు స్థానిక శాసనసభ్యులు…

Read More

సుప్రీంకోర్టు తీర్పు, నర్సాపురానికి బంగారు భవిష్యత్తు – ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.

నర్సాపురం: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు,నరసాపురం ప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు వేస్తుందని, స్థానిక లోక్సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో, స్థానిక జనసేన ఎమ్మెల్యే, విప్ బొమ్మిడి నాయకర్ తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. చించినాడ- దిండి, వశిష్ట వారధికి ఇరువైపులా ఉన్న జాతీయ రహదారి 216, విస్తరణ సంబంధించి భూసేకరణ విషయంలో, భూస్వాములు న్యాయం కోరుతూ,…

Read More

ప్రతి ఇంటికి పాడిపశువు ఉండాలి – కలెక్టర్ నాగరాణి

పాలకొల్లు: ఫిబ్రవరి, 18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలం, అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ప్రారంభించారు. గోమాతకు పూజలు చేసి శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, గర్భకోశ శస్త్రచికిత్స, నట్టల నివారణ, గోమార్ల నివారణ, ఉచిత మందులు, ల్యాబ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. రైతుల సమావేశంలో మాట్లాడుతూ,స్వచ్ఛమైన పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కల్తీ పాల వల్ల ప్రమాదాలు…

Read More