Telugu News Power

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రపరచు గొడౌన్ శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేసారు. గోదాములో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అలారం వ్యవస్థలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదోని ప్రత్యక్షంగా సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగించాలని…

Read More

చిన్నారిపై అఘాయిత్యం కేసులో నిందితుడి షాపు కూల్చివేత.

ఆచంట: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగిన దారుణం పై పోలీసులు స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వెలగన వెంకటస్వామి (70) షాపును పోలీసులు శుక్రవారం జెసిబి చేత నేలమట్టం చేయించారు.్ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు అత్యంత కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. నిందితుల అక్రమ కట్టడాలు, ఆస్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా నేరగాళ్లకు గట్టి హెచ్చరిక పంపాలని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోక్సో…

Read More

అనుబంధ బిల్లులు సమర్పించడానికి గడువు పెంచాలి. -యుటిఎఫ్ విజ్ఞప్తి.

అమరావతి: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) అనుబంధ బిల్లులు సమర్పించడానికి గొడుగు పొడిగించాలని కోరుతూ శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ కె. పద్మజను యుటిఎఫ్ రాష్ట్ర సంఘ పక్షాన కలిసి ప్రాతినిధ్యం చేసారు.సప్లిమెంటరీ ఎరియర్ బిల్స్ , ఉద్యోగ విరమణ చేసిన వారి సంబంధించిన బిల్స్ సబ్మిట్ చేయడానికి సైట్ ఓపెన్ కావడం లేదని,ఒకవేళ ఓపెన్ అయినా టోకెన్ నెంబర్ జనరేట్ కానీ విషయాలను డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజులు పాటు సప్లిమెంటరీ బిల్స్…

Read More

నరసాపురం డీఎస్పీగా మేకా సుధాకర్ నియామకం.

నరసాపురం: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక డివిజన్, డీఎస్పీగా మేకా సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించిన సుధాకర్‌కు విస్తృత అనుభవం ఉంది. నరసాపురం పరిధిలో చట్టం, శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ తో, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు.

Read More

అమరావతి రాజధాని సంబరాలు

పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్.కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో శుక్రవారం రాజధాని అమరావతిని, అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిన సందర్భంగా, కళాశాలలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. అమరావతి రాజధానిగా అధికారిక గుర్తింపు పొందడం రాష్ట్ర అభివృద్ధికి అవకాశం కల్పిస్తుదన్నారు. ఈ నిర్ణయం పరిపాలన, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమరావతి…

Read More

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దర్శించుకున్న స్విజర్లాండ్ సీఈవో.

శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, బి.సత్యనారాయణ రాజు శుక్రవారం సందర్శించారు. వీరు మీరు బి సత్యనారాయణ రాజు స్విట్జర్లాండ్, ఏ ఐ ఆర్ బి యు ఎల్ ఎల్ జెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ,సీఈవో గా పనిచేస్తున్నారు. శ్రీ స్వామివారిని అమ్మవార్లను రాజు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్, వేద ఆశీర్వావచన పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమం లో ఆలయ పర్యవేక్షకులు పసుపులేటి వాసు, ధర్మకర్త మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్ర…

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్తదాన శిబిరం.

పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక స్పృహతో బాధ్యతలు నిర్వహిస్తూ దండు పద్మావతి గురువారం జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ రక్తదాన శిబిరంలో స్వయంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని, యుటిఎఫ్ యలమంచిలి మండల శాఖ కృతజ్ఞతలు తెలిపింది.రక్తదానం చేయడం కోసం, తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని వైద్యుల అనుమతి పొంది, కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకుని రక్తదానం చేయడం ఆదర్శనీయమని కొనియయాడారు. ప్రధానోపాధ్యాయురాలిగా, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా దండు పద్మావతి విశేష…

Read More

రాష్ట్రంలో 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

-పెనుమదంలో రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ప్రకటన. పౌడూరు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పండించిన దాళ్వా ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. స్థానిక పెనుమదం లో రూ.4.49 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, రైతుల…

Read More

యలమంచిలి లో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం.

యమంచిలి: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చించినాడా, కాజ గ్రామాల్లో గురువారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు 40 మందికి భూమి హక్కుకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు సభలో అందజేశారు. రీ సర్వే చేసి రైతులకు ఖచ్చితమైన సమాచారంతో పాసుబుక్కు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయబడ్డారు. కార్యక్రమంలో, తహసిల్దార్ పవన్ కుమార్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు…

Read More

దక్షిణ కాశీ అంతర్వేది క్షేత్రంలో రక్షిత మంచినీటి పథకం ప్రారంభం. -వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అమరావతి/అంతర్వేది: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజోలు నియోజకవర్గం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గురువారం వర్చువల్ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలన్నాలరు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాల’ని స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో…

Read More