Skip to main content

Telugu News Power

నిషేధిత భూముల 22-ఏ సమస్యల పరిష్కారంపై కలెక్టర్ సమీక్ష.

భీమవరం: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన దరఖాస్తులను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించే దిశగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని బుధవారం పేర్కొన్నారు. పరిశీలించిన 16 దరఖాస్తుల్లో 10 కేసులు పరిష్కారం, 2 కేసులు తిరస్కరణ, 4 కేసులు పూర్తి పత్రాలు లేకపోవడంతో వచ్చే వారానికి వాయిదా వేశారు.రైతులు పట్టాదారు పాస్‌బుక్,…

Read More

కేంద్ర మంత్రి తో, రాష్ట్ర మంత్రులు భేటి.

న్యూ ఢిల్లీ: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయం మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుధవారం భేటీ అయ్యారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్,డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తోపాటు పలువురు ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రి వర్మ వీరిని సత్కరించారు.

Read More

ముద్రగడ కు నివాళులర్పించిన యలమంచిలి వైసీపీ నేతలు.

కిర్లంపూడి: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, ఎంపీ ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద బుధవారం, పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండల వైసీపీ నాయకులు నివాళులు అర్పించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబును కలసి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ పర్యటనలో ఎలమంచిలి మండల అధ్యక్షులు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, మండల వైసీపీ…

Read More

విస్తరిస్తున్న నిరసనలు, పట్టు బిగిస్తున్న లేఖర్లు.

పాలకొల్లు: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరింది. రిజిస్టార్ ఆఫీసు పరిధిలోని లేఖర్లను సంఘటిత పరుస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయటానికి ఎవరిని సాహసించటానికి అంగీకరించడం లేదు. వారిని ఏదో విధంగా వెనక్కు తిప్పి పంపుతున్నారు. దీంతో గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 ను తక్షణమే…

Read More

చాంబర్స్ కళాశాలలో ఇన్కమ్ టాక్స్ డే.

పాలకొల్లు: జూలై,22( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాలలో 167 వ ఇన్కమ్ టాక్స్ డే బుధవారం జరిగింది. ఆదాయపు పన్ను పై ఔట్రిచ్ ప్రోగ్రాం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పాలకొల్లు వారు సంయుక్తంగా నిర్వహించారు. “అవర్ టాక్సెస్ అవర్ ఫ్యూచర్ స్ట్రాంగర్ టుగెదర్ ఫర్ బెటర్ ఇండియా” అనే నినాదంతో ఈ…

Read More

విద్యార్థికి ఛాంబర్స్ కాలేజీ లో సన్మానం.

పాలకొల్లు: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థి అలుగుసాని రిత్విక్, ఎం ఈ సీ గ్రూపులో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా,రిత్విక్ ను ఛాంబర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కేవీర్ నరసింహారావు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిత్విక్ తల్లిదండ్రులు పాల్గొని తమ కుమారుని తీర్చిదిద్ధిన అధ్యాపకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ,కరస్పాండెంట్ కేవీ…

Read More

అంబరాన్నంటిన మండలి అభిమానుల సంబరాలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం అవనిగడ్డ: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలి అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు ఇకనుంచి ప్రతి ఏటా ఆగస్టు 4వ తేదీ అధికారికంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, మండలి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ప్రధాన కూడలిలో…

Read More

నేటి నుంచి సోలార్ రంగంలో ఉపాధికి శిక్షణ.

పాలకొల్లు: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ ఏ.ఎస్.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు “సోలార్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్” పేరుతో 9 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది . ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ మే నెలలో విజయవంతంగా పూర్తి కాగా, రెండవ బ్యాచ్ ప్రారంభం కానుంది. 18 సంవత్సరాలు పైబడిన నిరుద్యోగ యువత మరియు అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి…

Read More

వాకర్స్ క్లబ్, పాలకొల్లు రూ.30 వేల ఆర్థిక సాయం.

పెనుగొండ: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాకిలేరు గ్రామానికి చెందిన జవ్వాది లక్ష్మీ ప్రశాంతి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ లో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది. రెండవ సంవత్సరం ఫీజు చెల్లించలేని పరిస్థితిని ఉపాధ్యాయులు వాకర్స్ క్లబ్ పాలకొల్లు దృష్టికి తీసుకురావడం తో క్లబ్ సభ్యులు ఆమెకు 20 వేల రూపాయలు, పాలకొల్లు బివిఆర్ ఎమ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో 576 మార్కులు పొంది ట్రిపుల్ ఐటీ ఇడుపుల పాయ…

Read More

జేఈఈలో టాపర్ గా నిలిచాడు ఇప్పుడు కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచాడు. కబీర్ ఛిల్లార్ అద్భుత ప్రతిభ.

ముంబై: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలోనే అత్యంత కఠినమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన కబీర్ ఛిల్లార్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైనా తన ప్రతిభను చాటుకున్నాడు. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జూలై 10 నుంచి 19 వరకు జరిగిన 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ ( ఐ సి హెచ్ ఓ ) 2026లో కబీర్ స్వర్ణ పతకం సాధించాడు. జేఈఈ మెయిన్ 2026లో 300కు 300 మార్కులతో పర్ఫెక్ట్…

Read More