Telugu News Power

ఉపాధి హామీ, 37 కరువు మండలాలకు, 50 రోజుల పొడిగింపు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,25(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి నన్ను సార్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ లోని 37 కరువు మండలాలకు 50 రోజులపాటు ఉపాధి హామీ పథకం పొడిగించినట్టు బుధవారం తెలిపారు. శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు ప్రకాశం జిల్లాల కరువు ప్రభావిత 37 మండలాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అదనంగా 50 రోజుల ఉపాధి ఆమోదించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో అత్యంత సమయోచిత…

Read More

‘మళ్ళిన’ మృతికి ఘన నివాళి.

తణుకు: ఫిబ్రవరి, 25 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రముఖ పారిశ్రామికవేత్త మళ్లీన రామచంద్రరావు, బుధవారం మృతి చెందారు. వీరు పారిశ్రామిక కుటుంబీకుల రెండవ తరానికి చెందిన వారు. స్వచ్ఛంద సంస్థ రోటరీ ప్రముఖులు. సాహిత్య రంగానికి మహారాజ పోషకులు. వీరి మృతికి, ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, ఎమ్మెల్మే ఆరమిల్లి రాధాకృష్ణ తదితర ప్రముఖులు నివాళులర్పించారు.

Read More

ఏ.ఎస్.ఎన్.ఎం కళాశాలలో, దివిస్ ఉద్యోగ ఎంపికలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి, ప్రభుత్వ కళాశాలలో ఈనెల 26న ఉద్యోగాల ఎంపిక జరగనుంది. ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ, దివిస్ లేబరేటరీ లిమిటెడ్ వారు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మంగళవారం తెలిపారు. అభ్యర్థులు,2022 నుండి 2025 వరకు ఆయా డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు, 2026లో చదువుతున్న అభ్యర్థులు కూడ అర్హులు. బిఎస్సీ,(కెమిస్ట్రీ), బి ఫార్మసీ,బీటెక్,(మెకానికల్, కెమికల్,ఇన్స్ట్రుమెంటేషన్) ఎమ్మెస్సీ, (ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ), ఎం…

Read More

శాసనసభను ప్రత్యక్షంగా ,వీక్షించిన ఏ.ఏస్.ఎన్.ఏం విద్యార్థులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా,స్థానిక, ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల విద్యార్థులు మంగళవారం వీక్షించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ఆదేశాల మేరకు, కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు సభ జరుగుతున్న తీరును పరిశీలించారు. ప్రజాస్వామ్య లో శాసన వ్యవస్థ పనితీరు, బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశ పెట్టడం గురించి అవగాహన చేసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం, వివిధ అంశాలపై చర్చించడం, దానిపై నిర్ణయం…

Read More

భీమవరం ఆదిత్యాలో ఉద్యోగ మేళ.

భీమవరం: ఫిబ్రవరి, 24 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఈనెల 27న నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్, గంగానమ్మ ఆలయం సమీపంలో, బ్యాంక్ కాలనీ, దిరుసుమర్రు రోడ్ లో జరుగుతుంది. ఈ ఉద్యోగం మేళాలో 21 పైగా ప్రముఖ కంపెనీలు 2000 పైగా ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. అభ్యర్థులు, పదవ తరగతి,…

Read More

సొంతగూటికి శేషుబాబు, ఇదివరకే నాగబాబు.

పాలకొల్లు: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పవర్) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక నియోజకవర్గ రాజకీయ దిగ్గజం మేక శేషుబాబు తన పెద్ద కుమారుడు సందీప్ వివాహానికి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెళ్లి ఆహ్వానించారు. గత కొంత కాలంగా శేషుబాబు వైయస్సార్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు, అత్యంత విశ్వాస…

Read More

చెన్నై ఆలయం, హిందూ ముస్లింలకు ఆత్మీయ వరం

చెన్నై: ఫిబ్రవరి, 24 (తెలుగు న్యూస్ పవర్) ప్రేమ ఐక్యతలకు గుర్తుగా గత కొన్ని దశాబ్దాలుగా మద్రాస్ నడిబొడ్డున ఉన్న ఆలయంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులకు, గత 40 ఏళ్లుగా సుఫీదార ఆలయం రంజాన్ రోజున భోజన ఏర్పాట్లు చేస్తుంది. ఈ అద్భుతమైన ఆచారాన్ని, దాదా రతనచంద్ ప్రారంభించారు. మీరు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ హిందువులు. హిందూ ముస్లిం కార్యకర్తలు కలిసి 1200 మందికి వంట తయారు చేస్తారు….

Read More

పెళ్లి వలలో పడి యువతులు మోసపోకండి. –హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి.

హైదరాబాద్: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పేపర్) పెళ్లి పేరిట జరిగే మోసాలు, బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్ సిటీ కమిషనర్ విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.పరువుకు భయపడి మౌనంగా ఉండొద్దన్నారు. ధైర్యంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడం అవసరం అన్నారు. పెళ్లి ముసుగులో యువతులను మోసగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే…

Read More

వైసిపి కుట్రలపై విచారణ జరపాలి. -బిజెపి డిమాండ్.

భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) వైఎస్ఆర్ సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో హిందువులు, హిందూ దేవాలయాలపై జరిగిన కుట్రలపై దర్యాప్తు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు ఆధ్వర్యంలో కలెక్టర్ చదలవాడ నాగరాణికి సోమవారం, భీమరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్న పట్ల కపర్తి,పార్టీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి…

Read More

చెవిలో పట్టే రక్షణ పరికరం కనుగొన్న దక్షిణాఫ్రికా యువతి.

లింపోపో ప్రావిన్స్: దక్షిణాఫ్రికాకు చెందిన, బోహాలే ఎంఫహెలెలే అనే యువతీ చెవిలో పెట్టుకునే ఇయర్ ఫోన్ లా ఉండే ఓ రక్షణ పరికరాన్ని కనిపెట్టింది. చూడటానికి మీది ఇయర్ ఫోన్లో ఉన్నప్పటికీ ఇందులో అత్యధిక సాంకేతికత తో ఒక రక్షణ పరికరంగా రూపొందించారు. ఎవరైనా ఈ ఇయర్ ఫోన్ ధరించిన వారు దాడికి గురైనప్పుడు అత్యవసరంగా ఈ పరికరం ఫోటోలు తీస్తుంది. జిపిఎస్ పద్ధతిలో ప్రమాద హెచ్చరికలు లోకేషన్ తో పాటు పోలీసులకు, ఎమర్జెన్సీ నెంబర్లకు పంపుతుంది….

Read More