సమాజ రుగ్మతలపై అక్షరాయుధం సంధించిన -జాషువా.
పాలకొల్లు:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయుగ వైతాళికులు, కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ,…