Telugu News Power

తహశిల్దార్ కార్యాలయం వద్ద విఆర్వోల నిరసన.

యలమంచిలి: ఫిబ్రవరి, 19 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వీఆర్వోల నిరసన కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండల వీఆర్వోలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. జనవరి 12 నుంచి వర్కు టు రూల్ పాటించాలని సంఘం నిర్ణయించింది. వీఆర్వోలు రాత్రి పగలు తేడా లేకుండా బాధ్యతలు నిర్వహించవలసి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇందువల్ల కొందరు ప్రమాదాలకు గురవుతుంటే, మరి కొందరు ఆత్మహత్యలు పాల్పడ్డ…

Read More

రైల్వేవారు దారి వదలాలి రైతులు విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటు గురించి సేకరించిన భూమిలో రైల్వే వారు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏనుగువానిలంక,కలగంపూడి మధ్య ఉన్న 7 ఎకరాలు భూసేకరణలో రైల్వే వారు తీసుకున్నారు. దీనికి సంబంధించి రైతులకు సొమ్ము కూడా అప్పుడే చెల్లించారు. రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు ఇంతవరకు సజావుగా నిర్వహించుకుంటున్నారు. దాళ్వాపంట మాసూళ్లకువస్తున్న సమయంలో కంచ ఏర్పాటు చేయడం వల్ల రైతుల రాకపోకలకు అడ్డంకి ఎదురవుతుందని రైతులు…

Read More

ఏటిగట్టు పనులతో ప్రమాదం -పాలకొల్లు వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆరోపణ

యలమంచిలి: ఫిబ్రవరి,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానికంగా జరుగుతున్న ఏటిగట్టు పనులు ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆరోపించారు. ఏటిగట్టు పక్కనే ఉన్న మట్టి తవ్వి, పైకి వేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ గట్టు బలం లేక కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏటిగట్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని గోపి బుధవారం పరిశీలించారు. ఏటిగట్టు పనులు స్థానిక శాసనసభ్యులు…

Read More

సుప్రీంకోర్టు తీర్పు, నర్సాపురానికి బంగారు భవిష్యత్తు – ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.

నర్సాపురం: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు,నరసాపురం ప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు వేస్తుందని, స్థానిక లోక్సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో, స్థానిక జనసేన ఎమ్మెల్యే, విప్ బొమ్మిడి నాయకర్ తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. చించినాడ- దిండి, వశిష్ట వారధికి ఇరువైపులా ఉన్న జాతీయ రహదారి 216, విస్తరణ సంబంధించి భూసేకరణ విషయంలో, భూస్వాములు న్యాయం కోరుతూ,…

Read More

ప్రతి ఇంటికి పాడిపశువు ఉండాలి – కలెక్టర్ నాగరాణి

పాలకొల్లు: ఫిబ్రవరి, 18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలం, అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ప్రారంభించారు. గోమాతకు పూజలు చేసి శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, గర్భకోశ శస్త్రచికిత్స, నట్టల నివారణ, గోమార్ల నివారణ, ఉచిత మందులు, ల్యాబ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. రైతుల సమావేశంలో మాట్లాడుతూ,స్వచ్ఛమైన పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కల్తీ పాల వల్ల ప్రమాదాలు…

Read More

కత్తి పట్టిన క్షత్రియులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో, ఆఖరి మజిలీ చేసే స్మశాన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సంకల్పించినట్టు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. స్థానిక పూలపల్లి, రాజుల స్మశాన వాటిక ప్రాంతాన్ని భగవాన్ రాజు ఆధ్వర్యంలో పలువురు క్షత్రియులు కత్తి పట్టి శ్రమదానం చేసారు.అడవిలా…

Read More

నర్సాపురం వద్ద వంతెన నిర్మించాలి. -కాంగ్రెస్ పార్టీ డిమాండ్

నరసాపురం: ఫిబ్రవరి, 18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వశిష్ట గోదావరిపై వెంటనే వంతెన నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లా బీసీ నాయకులు,కొలకలూరి అర్జునరావు ఆధ్వర్యంలో బుధవారం, వాళ్ళందర్ రేవులో అర్జున్ రావు మాట్లాడుతూ, 2004 నుంచి చాలా ప్రభుత్వాలు మారినప్పటికి, ఇప్పటికీ బ్రిడ్జి నిర్మించకపోవడం పట్ల నిరసన తెలిపారు. సముద్రంలో కూడా బ్రిడ్జిలు కడుతున్న నేటి అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో, నర్సాపురం వంటి చిన్ని గోదావరి నిర్మించలేకపోవటం, ప్రజల్ని మభ్యపెట్టడమేనన్నారు. తాము…

Read More

సఖినేటిపల్లి నుంచి జాతీయ రహదారి 216.

రాజోలు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) దిండి – చించినాడ గోదావరిపై నది పై నిర్మించిన వంతెన, ఉభయ గోదావరి లను కలుపుతూ 216 జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. సఖినేటిపల్లి మీదుగా 216 జాతీయ రహదారి కలపటానికి, సుప్రీంకోర్టులో కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇంతకాలం,ఇందువల్ల జాతీయ రహదారికి అడుగు ముందుకు పడలేదు. రాజులు నియోజకవర్గ అభివృద్ధికి 216 జాతీయ రహదారి ఎంతో దోహదపడుతుంది. ఈ కేసులో, రాజోలు జనసేన,…

Read More

వాకర్స్ క్లబ్, పాలకొల్లు సహాయం.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే నిజమైన ఆనందం ఉన్నదని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. కొత్త కుళాయి చెరువు వద్ద సభ్యులతో కలిసి,మంగళవారం స్థానిక క్లబ్ తరపున, పలువురికి సహాయం అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, సలాది రామచంద్రరావు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, సభ్యులు కటారి నాగేంద్ర కుమార్, చామా శ్రీనివాసరావు, మానెం ధనుంజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ…

Read More

విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం, లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. పాఠశాలల్లో 6,328 మంది వద్దు లకు గాను 98 శాతం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ధనలక్ష్మి ప్రారంబభించారు. డాక్టర్ నవ్య జీవన్, మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు గంగాధర్ శర్మ, వీరస్వామి, పి సత్యనారాయణ రాజు, నెక్కంటి ఆదినారాయణ, ఆకుల ధనలక్ష్మీ,…

Read More