Telugu News Power

సీఎం రాకపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అధికారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో సీఎం సభ నిర్వహించనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా గ్రామ సభ,…

Read More

భీమవరంలో నూతన మల్టీపర్పస్ రెడ్ క్రాస్ భవనం నిర్మాణానికి స్థలం కేటాయింపు.

భీమవరం: జూన్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భారత రెడ్ క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా శాఖ పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో, అదే స్థలంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన బహుళ ప్రయోజనకర రెడ్ క్రాస్ నూతన భవనం నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం అనుమతులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం రాయలం గ్రామంలోని బ్లడ్ బ్యాంక్ కమ్యూనిటీ హాల్‌లో తాత్కాలికంగా సేవలు…

Read More

బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ పై విచారణ.

అమలాపురం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లాకలెక్టర్ ఆదేశాలతో, అమలాపురం, ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో మంగళవారం విచారణ జరిపారు. బాలిక గర్భవిఛ్ఛిత్తి కేసుకు సంబంధించి డాక్టర్ లంకె శిరీషను అధికారుల బృందం ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన బాలిక అబార్షన్ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో, కలెక్టర్ ఆదేశాలతో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో ప్రత్యేక విచారణ చేపట్టారు.విచారణ బృందంలో కొత్తపేట ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్‌వో దుర్గారావు,…

Read More

వివాహిత కుమార్తెలకూ కారుణ్య నియామక హక్కు.. చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:జూన్,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళల సమాన హక్కులకు బలమైన ఊతమిచ్చే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. వివాహం చేసుకున్న కుమార్తెను కేవలం ఆమె వైవాహిక స్థితి ఆధారంగా కుటుంబ సభ్యురాలిగా పరిగణించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కుటుంబంలోని ఆధారపడిన సభ్యురాలైతే, ఇతర అర్హతలు నెరవేర్చినట్లయితే వివాహిత కుమార్తె కూడా కారుణ్య నియామకం లేదా కారుణ్య ప్రాతిపదికన లభించే ప్రయోజనాలకు అర్హురాలేనని తీర్పు చెప్పింది. న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం…

Read More

నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం. ఆరోగ్యానికి, పర్యావరణానికి సైకిల్ యాత్ర ఎంతో మేలు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ సైకిల్ దినోత్సవం” జరుపుకుంటారు. సైకిల్ యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు పర్యావరణ పరిరక్షణకు దాని పాత్రను చాటి చెప్పేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2018లో అధికారికంగా ప్రకటించింది. సైకిల్‌కు ప్రత్యేక గుర్తింపు: దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన సైకిల్ ప్రపంచంలో అత్యంత సరళమైన, చౌకైన, విశ్వసనీయమైన రవాణా సాధనాల్లో ఒకటి. ఇంధనం అవసరం లేకుండా…

Read More

ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మీరు ప్రస్తుతం జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులుగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలకొల్లు మండలం, పూలపల్లి వీరి స్వగ్రామం. గతంలో వీరు పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సమావేశంలో రైతులు…

Read More

ఉపాధి శ్రామికులకు మజ్జిగతో సేద తీర్చిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అన్నట్టుగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఉపాధి శ్రామికుల వద్దకు స్వయంగా వెళ్లి సోమవారం వారికి మజ్జిగతో సేద తీర్చారు. స్థానిక వెలివెల గ్రామంలో పంట బోదులలో పని చేస్తున్న శ్రామికుల వద్దకు కాలువలో దిగి వెళ్లి శ్రామికులకు మజ్జిగ అందజేశారు. గత ఏడాది నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో…

Read More

బాధితులకు మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు బెదిరింపులు. రైస్ మిల్లు వ్యవహారంలో ఏడు కోట్లు ఎగవేత.

పాలకొల్లు:జూన్ 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెలగ శ్రీరామమూర్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిర్మాణానికి సంబంధించి మేక శేషుబాబు కుటుంబసభ్యులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని బాధితుడు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యి మళ్లీ ఇటీవల…

Read More

నేటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం. విశాఖపట్నం కేంద్ర కార్య స్థానం.

జనరల్ డస్క్: మే, 31 (తెలుగు న్యూస్ పవర్ కాం). కేంద్ర ప్రభుత్వం దక్షిణ తీర రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించింది. ఇది 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా ఉంటుంది.“కొత్త రైల్వే జోన్” ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, జోన్ ఏర్పాటును ఖరారు చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొత్త జోన్‌గా ప్రకటించారు. నేటి నుంచి అమలులోకి వచ్చింది. విశాఖపట్నం అధికారిక ప్రధాన కార్యాలయం గా ఉంటుంది.ఇది భారత…

Read More

అభివృద్ధి పనుల వేగం పెంచాలి. -మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు: మే 30(తెలుగు మూవీస్ పవర్. కామ్) నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనంపై శనివారం పర్యటించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. నర్సాపురం ప్రధాన కాలువపై లారీ స్టాండ్ సమీపంలో పాలకొల్లు- మార్టేరు ఆర్ అండ్ బి…

Read More