Skip to main content

Telugu News Power

ప్రధాని నివాసం ఎదుట ప్రతిపక్ష నేతల నిరసన.

రాహుల్, ప్రియాంక, అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. న్యూఢిల్లీ:జులై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం సమీపంలో మంగళవారం నిరసన చేపట్టిన ప్రతిపక్ష నాయకులను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని బలవంతంగా తొలగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి…

Read More

మంత్రిని కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ.

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుకు జేఏసీ అధ్యక్షులు యూత్ పాండురంగారావు ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. పి ఆర్ సి కమిటీ ఏర్పాటు చేయడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, వెంటనే పిఆర్సి కమిటీ వేసి అయ్యారు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఐదు డిఏలు, గత పిఆర్సి బకాయిలు దక్షిణం…

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత. -కలెక్టర్ నాగరాణి

భీమవరం: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ప్రజల నుంచి 141 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో 53 అర్జీలు స్వీకరించి, సంబంధిత శాఖలు నిర్దేశిత గడువులో నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మళ్లీ అదే సమస్యతో అర్జీలు ఇవ్వాల్సిన పరిస్థితి…

Read More

పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావుకుశ్రద్ధాంజలి.

రాజమహేంద్రవరం: జూలై,20 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు జీఎస్ రావుకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. స్వస్థలం పెద్దేవం గ్రామం సోమవారం, ఆయన నివాసానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. జీఎస్ రావు సతీమణి, కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడును ఓదార్చి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర సమన్వయకర్త…

Read More

శ్రీలంకలో జయశ్రీ మహాబోధి టెంపుల్ సందర్శించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్.

శ్రీలంక తెలుగు కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం అనురాధపురలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం “జయశ్రీ మహాబోధి టెంపుల్” సందర్శించారు. ఈ బౌద్ధక్షేత్రం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న బోధివృక్షం భారతదేశంలోని బోధ్‌గయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి వృక్షానికి చెందిన కొమ్మ నుండి పెంచబడినదిగా బౌద్ధ సంప్రదాయం చెబుతుంది. ఈ మహావృక్షాన్ని బంగారు కడ్డీలతో సంరక్షిస్తున్నారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో చక్రవర్తి…

Read More

రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ లేదు. -స్పష్టం చేసిన ప్రభుత్వం

అమరావతి: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరిస్తున్నట్టు వైసిపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రజలకు మరింత చేరువగా రిజిస్ట్రేషన్ శాఖ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి సేవా కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చట్టబద్ధ అధికారాలన్నీ రిజిస్ట్రేషన్ శాఖ తన వద్ద ఉంచుకుందని స్పష్టం చేసింది. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందుతున్నందున, అదే తరహాలో…

Read More

చిన్నారికి పునర్జన్మనిచ్చిన సీఎం సహాయనిధి. -మంత్రి నిమ్మల వ్యక్తిగత శ్రద్ధ

పాలకొల్లు/ యలమంచిలి: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మానవీయ శ్రద్ధ, సేవల వల్ల ఓ బాలిక పునర్జన్మ ఎత్తింది. బాలిక నిండు నూరేళ్ల జీవితం మొగ్గలోనే రాలిపోకుండా, నిమ్మల అమృత హస్తాలు ఆదుకొని, ఆ కుటుంబంలో నెలకొన్న విషాద చీకట్లను తొలగించి, సంతోషాల వెలుగులు నింపింది. యలమంచిలి మండలం, కనకాయ లంకకు చెందిన బాలిక కొల్లు అనూష గుండెకు రంధ్రం ఉండటంతో జీవితం ప్రమాదంలో…

Read More

దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన ప్రారంభం.

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక సబ్-రిజిస్టార్ కార్యాలయం వద్ద సోమవారం దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం శిబిరాన్ని సంఘ అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. వేలాదిమంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ప్రస్తుత వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా, లేకర్ల పొట్ట పొట్టే విధంగా ప్రభుత్వం తీసుకు వస్తున్న 396 జీవో వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేఖర్లతో పాటు డిటిపి ఆపరేటర్లు, పరోక్షంగా ఇంకా ఎందరో ఈ వృత్తిపై ఆధారపడి…

Read More

రక్షణ చట్టాలపై బాలికలకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు:జూలై, 20( తెలుగు పవర్ డాట్.కామ్) పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోలా రజనీకుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బివిఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు, మహిళా ఉపాధ్యాయులకు, సిబ్బందికి మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి నియంత్రణపై, మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిఐ రజినీకుమార్ సదస్సులో వివరించారు. మహిళ భద్రతలో భాగంగా బాల్య వివాహాల నిషేధ చట్టం, భారతీయ న్యాయ సంహిత ( బి.ఎన్.ఎస్)…

Read More

జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి అకానే యమగుచిని, ఆమె సొంతగడ్డపై ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. ఈ ఘనతపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా, ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి…

Read More