Telugu News Power

రేపే ఎమ్మెల్సీ అభ్యర్థి బి. గోపి మూర్తి పరిచయ సభ.

భీమవరం:జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుత ఉపాధ్యాయ, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొ ర్రా గోపి మూర్తి, రెండవసారి పోటీకి అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సందర్భంగా, ఆదివారం ఉదయం 9 గంటలకు భీమవరం,బ్యాంకు కాలనీ,శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో అభ్యర్థి పరిచయ సభ ఏర్పాటు చేసినట్టు పత్రికా ప్రకటనలో తెలిపారు. యూటీఎఫ్ నాయకులు, నాటి ఎమ్మెల్సీ షేక్ షాబ్జి రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భంగా, జరిగిన ఉప ఎన్నికల్లో గోపి మూర్తి పోటీ చేసి ఘన విజయం సాధించారు….

Read More

కార్యకర్తకు సొంత ఖర్చులతో కేంద్రమంత్రి గృహ నిర్మాణం. ఎంపీ బృందం శ్రమదానం.

ఉండి: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉండి నియోజకవర్గం కొండేపూడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త రామారావుకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ఎంపీ, కేంద్రమంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నూతన గృహాన్ని తన సొంత ఖర్చుతో నిర్మిస్తున్నాము. ఆ ఇంటి స్లాబ్ పనుల్లో గురువారం స్వయంగా పాల్గొని కార్యకర్తలతో కలిసి ‘శ్రమదానం’ చేసారు. ఈ సందర్భంగా, కేంద్రమంత్రి ఆనందాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు.ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న…

Read More

జై భీమ్ ఫౌండేషన్ చేయూత.

యలమంచిలి: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మట్లపాలెం గమల్లపెంటకు చెందిన జై భీమ్ యువజన ఫౌండేషన్, పక్షవాత అనారోగ్యంతో బాధపడుతున్న, చింత దిబ్బకు చెందిన చివ్వేటి ఆనంద్, వారి సతీమణి సత్యవతి కుటుంబానికి 17 వేల500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఫౌండేషన్ ప్రతినెలా, మానవీయ కోణంలో ఆలోచించి, ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతినెలా ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో, వ్యవస్థాపక అధ్యక్షులు, మదర్ తెరిసా అవార్డు…

Read More

ఓటర్ల సవరణలో బి ఎల్ ఓ లు అప్రమత్తతో ఉండాలి. -ఆర్డీవో దాసిరాజు ఆదేశాలు.

పాలకొల్లు,: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల విస్తృత తనిఖీ కార్యక్రమంలో బిఎల్ఓ లు అప్రమత్తతో ఉండాలని నరసాపురం ఆర్డీవో, ఎన్నికల అధికారి దాసిరాజు, బూత్ లెవెల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో, గురువారం జరిగిన బి ఎల్ ఓ లు, పార్టీల బూత్ కమిటీ సభ్యులకు జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆర్డిఓ పలు సూచనలు చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో జనన ధ్రువపత్రం తప్పనిసరిగా తనిఖీ…

Read More

ప్రముఖ నటులు, రచయిత గిరీష్‌ కర్నాడ్‌ అస్తమయం.

జనరల్ డెస్క్: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్)నాటక రచయిత, సినిమా నటులు, ప్రముఖ సామాజికవేత్త గిరీష్‌ కర్నాడ్‌ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం బెంగళూరులోని ఆసుపత్రిలో మృతిచెందారు. మహారాష్ట్రలో మే 19, 1938లో జన్మించిన గిరీష్‌ కర్నాడ్‌ 1958లో కర్ణాటక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1963లో ఎం.ఏ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్‌ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించారు. సామాజిక విలువల కోసం చివరి వరకు…

Read More

నాటకం ప్రజల వద్దకు వెళ్లి, ముందు తరాలకు మానవ విలువలు అందించాలి. -నాటక రచయిత తాళాబత్తుల

పాలకొల్లు: జూన్,11(తెలుగు న్యూస్ పవర్. కామ్) మానవ విలువలు ముందు తరాలకు అందించడానికి ప్రజలలోకి వెళ్లాలని నాటక రచయిత, నటుడు, ప్రయోక్త, నంది అవార్డు గ్రహీత, తాళాబత్తుల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక రసధుని సాహిత్య సంస్థ, నెలవారి కార్యక్రమాల్లో భాగంగా, గురువారం, పింఛనుదారుల భవనం, సిరి తోటి రాఘవులు, దండు చిన రామకృష్ణంరాజు సమావేశ మందిరంలో “నాటక రంగం-మానవీయ కోణం” అనే అంశంపై వక్త తాళాబత్తుల వెంకటేశ్వరరావు ప్రధానోపన్యాసం చేశారు. ఈ సభకు, కొట్టి భాస్కరరావు అధ్యక్షత…

Read More

మోడీ, పుష్కరకాల ప్రధానమంత్రిగా, పాలనకు మద్దతుగా పూజలు.

పాలకొల్లు: జూన్,10(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశంలో సర్వతోముఖ అభివృద్ధి వైపు నడిపిస్తున్న ప్రధాని మోడీ పుష్కరకాలం పాలనకు మద్దతుగా రాజ్యసభ సభ్యులు, పాక వెంకట సత్యనారాయణ బుధవారం క్షీరారంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎంపీకి, పూర్ణకుంభంతో ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరా రామ క్షేత్రంలో వేంచేసి ఉన్న విఘ్నేశ్వరునికి, మహాదేవునికి పూజలు చేశారు. మోడీ సుస్థిర పాలనలో ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందు ఉండాలని, ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక…

Read More

శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల ఫిదా.

పాలకొల్లు: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రమైక జీవన సౌందర్యానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఫిదా అయ్యారు. నెలన్నర పాటు జరిగిన ఉపాధి హామీ పనులకు హాజరై, మండుటెండలో పనిచేసిన శ్రామిక లోకానికి గౌరవ సత్కారం అందజేశారు. వెలవిలి గ్రామంలో బుధవారం ఏర్పాటు అయినా సభలో శ్రామిక జన సందోహంతో మంత్రి ఉత్సాహంగా ముచ్చటించారు. శ్రామికులకు స్వయంగా, కొసరి కొసరి రొయ్యల పలావు వడ్డించారు. ఉపాధి హామీ పనులలో శ్రామికులకు మంత్రి మొబైల్ చలివేంద్రాలు…

Read More

సంగీత దర్శకుడు రఘు కుంచే కు ఎస్పి బాలు అవార్డు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) కళా దర్బార్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, గుంటూరు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్పీ బాలు ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం గుంటూరులో వీటివల జరిగింది. సినీ రంగం నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు, దర్శకుడు, నటుడు రుఘు కుంచే ఈ ప్రతిష్టాత్మక అవార్డు శ్రీరంగం నుంచి అందుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయని, ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి ఎస్పీ శైలజ, ఇతర ప్రముఖులు రఘు కుంచెను ఘనంగా సత్కరించారు. ఈ…

Read More

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రుల పరామర్శ.

విశాఖపట్టణం: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ( కేజీహెచ్) వద్ద కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి మంగళవారం పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించడంతోపాటు, ఆ కుటుంబాలకు అన్ని విధాలా కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం…

Read More