Telugu News Power

శివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారుల సమీక్ష.

పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో, ఈనెల 15 ఆదివారం నుంచి జరగనున్న శివరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు సమీక్ష జరిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఇంతవరకు చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులకు ఈ ఓ ముచ్చర్ల శ్రీనివాసరావు వివరించారు. దేవాదాయ శాఖ, డిప్యూటీ కమిషనర్, రమేష్ బాబు, , అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్, ఇన్స్పెక్టర్, వి వెంకటేశ్వరరావు,ఆలయంలో జరగనున్న ఏర్పాట్లు…

Read More

చించినాడ నుంచి అంతర్వేదికి భక్తుల పాదయాత్ర.

యలమంచిలి: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) ,శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అంతర్వేది క్షేత్రానికి భక్తులు పాదయాత్ర చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం, చించినాడ గ్రామం నుంచి, అంతర్వేది క్షేత్ర దర్శన పాదయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. తొలిసారి. ప్రారంభించిన ఈ పాదయాత్రలో . వందల మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సుమారు రెండు గంటల సాగింది. భక్తులు ఆంజనేయస్వామి, జెండా చేపట్టి,వివిధ దేవుళ్ళ నామస్మరణ చేస్తూ…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ, స్వర్ణమయ, స్వర్ణ నిధి పథకానికి, స్థానిక భక్త దంపతులు, గోంట్ల వెంకట రామారావు, వెంకట లక్ష్మి సత్యవతి ఆదివారం బంగారం కానుకగా సమర్పించుకున్నారు. లక్ష 17 వేల రూపాయల విలువైన, 8 గ్రాముల బంగారాన్ని అమ్మవారికి, ఆలయ అధికారుల ద్వారా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఈ పుణ్య దంపతులకు, వేద ఆశీర్వచన పూజలు చేసి,…

Read More

యలమంచిలిలో రథోత్సవం

యలమంచిలి: ఫిబ్రవరి, 7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక భక్తాంజనేయ స్వామి వారి నూతన నిర్మాణ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు శుక్రవారం నిర్వహించారు. స్వామివారికి సువర్చలాదేవికి కళ్యాణం శుక్రవారం జరిగింది. అనంతరం స్వామి వారిని రథంపై అధిష్టించి, గ్రామ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ప్రధాని లాగటానికి మహిళా భక్తులు పోటీపడ్డారు. ఏటి గట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు, ప్రధాన వీధుల గుండా సాగిన…

Read More

ఏడువారాల వెంకటేశ్వరుని ఈ ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు.

ఆత్రేయపురం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఏడువారాల వెంకటేశ్వరుని, స్థిర వారం ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు భక్తులు సమర్పించుకున్నట్టు దేవాదాయ వర్గాలు తెలిపారు. వేద ఆశీర్వచనం,1,116 రూపాయల టికెట్ ద్వారా ఈ ఆదాయం లభించింది. వీరికి ఇకనుండి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. ఇకనుంచి వి ఐ పి లు కూడా 200 రూపాయల టికెట్ అనివార్యంగా కొనవలసి ఉంటుంది. సిఫార్సులను దూరంగా ఉంచడానికి,250 మంది ఉద్యోగుల సెల్ ఫోన్లు ఆఫీసులో భద్రపరుస్తారు. కేవలం 5 మంది ఆలయ…

Read More

ఘనంగా భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక పెదచెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, స్వామివారికి పంచామృత ఫల రసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తమలపాకులు,సింధూరంతో సహస్రనామార్చన జరిగింది. భక్తాంజనేయ స్వామి వారికి శాంతి కల్యాణం చేశారు. ఈ వార్షికోత్సవ, అభిషేకపూజా కార్యక్రమానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. ఆలయ చైర్మన్ కాసా సత్యనారాయణ, బండారు రాధాకృష్ణ, ఆకుల భాస్కరరావు, ఆకుల నరసింహారావ,…

Read More

భీమవరం మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదాన పథకానికి సుంకర వారి భూరి విరాళం.

భీమవరం: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, మహిమాన్విత మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన వితరణకు శుక్రవారం భూరి విరాళం భక్తులు సమర్పించుకున్నారు. కీర్తిశేషులు, సుంకర శ్యామల బ్రహ్మాజీరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక లక్ష 12వేల రూపాయల నగదు దేవస్థానం వారికి అందజేశారు. ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దాతలకు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహాలక్ష్మి నగేష్ భక్తులకు అమ్మవారి చిత్ర…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామియే మా రక్షకుడు-ఎమ్మెల్యే దేవర ప్రసాద్.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహుడే తమను కాపాడుతున్నాడని, జనసేన నాయకులు, రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ వెల్లడించారు. స్వామివారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన కార్యక్రమం సందర్భంగా, గురువారం, వరప్రసాద్ మాట్లాడారు. మోంత తుఫాను, ఇరుసుమండ బ్లో అవుట్ నుంచి ఆ నరసింహస్వామి కాపాడారని తెలిపారు. ఈ క్షేత్రంలో తొమ్మిది బుధవారాల ప్రాశస్త్యం గురించి చాగంటి వారు తన ప్రవచనంలో తెలియజేయాలని కోరారు. దాదాపు 34 ఎకరాలు…

Read More

మహాశివరాత్రి ఏర్పాట్లపై తహశిల్దార్, సమన్వయ కమిటీ సమావేశం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి సందర్భంగా, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తహశిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ అధ్యక్షతన, వారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి ఈనెల 15న అత్యంత వైభవంగా జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలక్కుండా ఉండటానికి తహసిల్దార్ కిషోర్ వివిధ శాఖల అధికారులకు పలు…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరిగాయి. పవళింపు సేవతో మంగళవారం రాత్రి కి సంపూర్ణం అయ్యాయి. అర్చక స్వాములు స్వామివారికి పుష్ప ఉత్సవం చేశారు. అంతరాలయంలో స్వామి వారిని, అమ్మవారిని కొలువు తీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. తిరుమంజనములు, ద్వాదశ తిరువారాధన, దర్పణసేవ, ధూప సేవ జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఏకాంత పవళింపు మందిరంలో…

Read More