Skip to main content

Telugu News Power

పెద గోపురంలో దేవేరులకు శాకంబరీ అలంకరణ.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ పార్వతీ దేవి అమ్మవారు, శ్రీలక్ష్మి దేవి అమ్మవార్లకు ఆషాడ మాసం సందర్భముగా శాఖంబరి అవతారంతో శుక్రవారం అలంకరించారు ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప), వివిధ రకములైన కూరగాయలతో పలు రకాల పండ్లతో అలంకరణ చేసారు. దేవేరుల శాకాంబరి అలంకరణ చూసి భక్తులు తన్మయులై, ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణకు పిలుపు.

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేలుపు, ప్రముఖ ఆరాధ్యదైవమైన శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణ మహోత్సవం వచ్చేనెల1న ఉదయం 9 గంటలకు శ్రీ అమ్మవారి మహిళా సేవకులు ఘనంగా సమర్పించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పూరి గుడి నుంచి శోభాయాత్ర ప్రారంభమై…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారినిదర్శించుకున్న కలెక్టర్.

భీమవరం:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదం సమర్పించగా, కలెక్టర్ తనయుడు భరత్‌, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి అనుగ్రహ దర్శనం అందుకొన్నారు.

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.లక్ష విరాళం

భీమవరం: జూలై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రనిధికి భీమవరం కి చెందిన ముప్పాళ్ళ నరసరాజు, నాగమణి దంపతులు ఒక లక్ష రూపాయలు విరాళంగా మంగళవారం అందజేశారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ఆలయ ధర్మకర్త గుసిడి నాగ శిరీష అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజే సారు….

Read More

శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం.

భీమవరం : జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహమే పట్టణాభివృద్ధికి మూలమని, అమ్మవారి దయ సిరిసంపదలు వెల్లివిరుస్తాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరంలో 3వ వార్డులో ప్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 34వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 38వ వార్డు లంకపేటలో అమ్మవారి 11వ వార్షిక జాతర మహోత్సవాన్ని, 35వ వార్డు సూర్యనారాయణ పురం యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి…

Read More

క్షీరా రామం మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పంచారామ శిరోభాగ క్షేత్ర, శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ మాడవీధుల్లో సోమవారం భక్తులు సప్త ప్రదక్షిణలలో భారీగా పాల్గొన్నారు. సప్త మారేడు దళములు, సప్త ప్రదక్షణ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసుతో కలిసి పట్టణ ఎస్సై రజిని కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లోక కళ్యాణార్థం, వర్షాల రాక కోసం, రాత్రి పంచ హారతులు…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ. లక్ష విరాళం.

భీమవరం: జూలై 17, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి పెన్నాడ కి చెందిన సోము స్వరూప్ కుమార్ వారి కుమార్తె చిరంజీవి. గీత సహస్ర పేరుమీద ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుక.

భీమవరం: జూలై,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం కి చెందిన భీమనాధం భాస్కరరావు జ్ఞాపకార్థం వారి భార్య జయలక్ష్మి నాలుగు గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల్ ఆంజనేయ ప్రసాద్…

Read More

శ్రీ మావుళ్ళమ్మలు దర్శించుకున్న సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ.

భీమవరం: జూలై 14, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ప్రఖ్యాత తెలుగు సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయ కృష్ణ మంగళవారం దర్శించుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: జూలై, 14 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా, మంగళవారం చండీహోమం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులు నిర్వహించారు,90 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధమహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం…

Read More