Telugu News Power

తిరుమల పవిత్రతను కాపాడాలి. చైర్మన్ నాయుడును బర్తరఫ్ చేయాలి. -తి.తి.దేవస్థానం మాజీ ధర్మకర్త శేషుబాబు డిమాండ్.

పాలకొల్లు: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ఆలయ చైర్మన్ బి ఆర్ నాయుడు వెంటనే బర్తరఫ్ చేయాలని టీటీడీ ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మేకా శేషుబాబు డిమాండ్ చేశారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ శ్రేణులతో కలసి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More

శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి రూ.64 వేలు.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణ నిధికి రూ.64వేల రూపాయల విరాళం, శృంగవృక్షంకు చెందిన పచ్చిపులుసు యానాది శెట్టి అన్నపూర్ణ దంపతులు 4.300 గ్రాముల బంగారం సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ప్రసాదం ఫోటో అందచేసినారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శనివారం తెలిపారు.

Read More

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయం 41 రోజు పూజలు.

యలమంచిలి: ఏప్రిల్, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి నూతన ఆలయ ప్రవేశం సందర్భంగా, 41 వ రోజు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు నిర్వహించారు. గ్రామోత్సవం లో 108 కలశములతో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. దీపజ్యోతుల తో రాత్రి గ్రామంలో ఊరేగి, అమ్మ వారికి హారతులు సమర్పించారు.

Read More

శ్రీ క్షీరారామ ఆలయ అమ్మవార్లకు సారె సమర్పణ.

పాలకొల్లు: ఏప్రిల్, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల 27న ప్రారంభమైన కల్యాణోత్సవాలు గురువారం ఘనంగా పరిపూర్ణం అయ్యాయి. శ్రీ స్వామివారి ఆలయంలో కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ పుష్ప ఉత్సవంజరిగింది. ఈ కార్యక్రమంలో 27 జంటలతో, సారే, కార్యక్రమమం జరిగింది. పురవీధులలో, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి తరలి వచ్చారు. శ్రీ అమ్మవార్లకు సారే సమర్పించారు

Read More

క్షీరారామంలో చక్రస్నాపూజలు

పాలకొల్లు: ఏప్రిల్ ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ)స్థానిక, పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ,శ్రీ స్వామీవారి ‌ చక్రస్నాన పూజలు,తదనంతరం శ్రీ చక్ర స్నాన పూజల లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, నీలపు సింహాచలం, నీలాపు మణి, భాసి న అప్పల…

Read More

ఘనంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దివ్య కళ్యాణం.

ముత్యాలతలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భువనేశ్వరి దంపతులు. ఒంటిమిట్ట: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్ . కామ్) ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం, శ్రీమన్నారాయణ అవతారమైన శ్రీ రామచంద్రుడు, సీతామ్మ వారి దివ్య వివాహం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తి శ్రద్ధలతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఏకసిలా నగరం ఎల్లెఎడల, శ్రీ రామ నీ నామెంతో రుచిరా అంటూ మారు మోగిపోయింది.రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన…

Read More

క్షీరారామంలో నృత్య ప్రదర్శనలు.

పాలకొల్లు: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి పంచారామ క్షేత్రంలో కళ్యాణోత్సవాల్లో భాగంగా, భక్తుల కోసం నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన తిలకించిన భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాస్ నృత్యకళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కళ్యాణోత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకులు…

Read More

కృష్ణ శిలతో ఆకివీడులో రామాలయం – ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు

ఉండి: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీరా మనవ సందర్భంగా, రామాలయ ప్రవేశానికి అభ్యంతరం తెలిపిన వివాదంతో తెలుగులోకి వచ్చిన నాకు వీడు పెదపేట పురాతన రామాలయం నిర్మాణానికి పూనుకున్నట్టు ఉపసభాపతి కనుమూరి రఘవరామ కృష్ణంరాజు ఆదివారం తెలిపారు. రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో చేపట్టనున్నామని శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆదివారం తెలిపారు. ఈ ఆలయాన్ని శిల్పకళ, వాస్తు, ఆగమ…

Read More

శ్రీ పార్వతీ పరమేశ్వర ఆలయం, బెంగుళూరు, ధర్మకర్తగా జక్కంపూడి కుమార్.

బెంగళూరు/పాలకొల్లు: మార్చి,29(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ పార్వతీ పరమేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు,బెంగళూరు సభ్యునిగా పాలకొల్లుకు చెందిన, జిల్లా బిజెపి నాయకులు జక్కంపూడి లక్ష్మీ నరసింహ నాగేంద్ర కుమార్(కుమార్) దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమితులయ్యారు. ఈ మేరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రావెళ్ల రామకృష్ణ నియామక ఉత్తర్వులు ఆదివారం అందజేశారు. ఆధ్యాత్మిక, కళ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాల్లో, బహుముఖంగా సేవలందిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో అందరివాడుగా కుమార్, చిరపరిచితులు. అజాతశత్రువు గా అందరినీ గౌరవించే…

Read More

క్షీరపురిలో కొలువుదీరిన అష్టదిగ్గజ కవులు.

పాలకొల్లు: మార్చి, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) క్షీరపురిలో, రాయల కాలం నాటి అష్టదిగ్గజ కవుల దిగి వచ్చారా అన్నట్టుగా, భూవన విజయం ప్రదర్శించారు. శాఖ సంస్కార భారతి, పశ్చిమగోదావరి జిల్లా శాఖ, క్షత్రియ సంక్షేమ పరిషత్, కాశ్మీరు కల్చరల్ క్లబ్ సౌజన్యంతో మీ ప్రదర్శన జరిగింది. శ్రీరామనవమి, ప్రపంచ రంగస్థలం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పివిఎన్ కృష్ణ, శ్రీకృష్ణదేవరాయలుగా, డాక్టర్ కడిమళ్ళ వరప్రసాద్, మహామంత్రి తిమ్మరసు గా, చేగొండి సత్యనారాయణ మూర్తి,…

Read More