అధికారులు సమావేశానికి రావాలి ఎంపీపీ ధనలక్ష్మి
యలమంచిలి మండల పరిషత్ సమావేశానికి సంబంధిత అధికారులు విధిగా హాజరుకావాలని అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం,కార్యాలయ సమావేశం మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు ఇంచుమించు అందరూ గైరహాజరయ్యారు. వివిధ కారణాలు చూపి వారి కార్యాలయ సిబ్బందిని సమాచారం లేకుండా, ఉన్న సభ్యులు సరిగ్గా వివరించలేకపోవడం వల్ల ఎంపీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార మార్పిడి తరువాత బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ అధ్యక్షతన జరిగిన తొలి…