Telugu News Power

యూత్ క్లబ్ కొంతేరు పరిషత్ కు ఎంపికైన ఏడు నాటికలు.

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కొంతేరు యూత్ క్లబ్ తరపున గత 44 ఏళ్లుగా నాటకపరిషత్ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నాటకోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ పరిషత్తులో ప్రదర్శించడానికి ఏడు నాటికలు అర్హత పొందాయి. నాటికలు ఈ ఏడాది మే నెల 1 నుంచి 3 వరకు, మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు, క్లబ్ అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ వెల్లడించారు. 1.తితిక్ష బి వి కె క్రియేషన్స్, కాకినాడ, రచన: డి ఉమాశంకర్, దర్శకత్వం…

Read More

కృత్రిమ మేధా సదస్సుకు అమలాపురం వాసులకు ఆహ్వానం.

అమలాపురం: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) దేశ రాజధాని, ఢిల్లీలో నిర్వహించనున్న, కృత్రిమ మేధా, శిఖరాగ్ర సమావేశానికి, అమలాపురం శాస్త్రవేత్తలకు ఆహ్వానం అందింది. “ఇండియా ఏ ఐ ఇంపాక్ట్-2026′, ఈ నెల19-20 వరకు జరుగుతుంది. ఈ సదస్సులో, కృత్రిమ మేధకు సంబంధించి, పరిణామక్రమాన్ని, భవిష్యత్తును చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిల్ గేట్స్, సుందర్ పిచ్చాయ్, ముఖేష్ అంబానీ, వివిధ దేశాల నుంచి వందకు పైగా గ్లోబల్ సీఈఓ లు, సీటీవోలు ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు….

Read More

మిర్చి యార్డ్ ఉపాధ్యక్షురాలిగా జనసేన వీర మహిళ.

గుంటూరు: ఫిబ్రవరి, 6 (తెలుగు న్యూస్ పవర్) ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు, ఉపాధ్యక్ష పదవికి, బిట్రగుంట మల్లిక ఎంపికయ్యారు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, జనసేన పార్టీలో అనేక పార్టీ పదవులలో పనిచేశారు. గుంటూరులో కార్పొరేటర్ గా జనసేన తరఫున పోటీ చేశారు. వీరి ఎంపిక పట్ల జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పలువురు జనసేన నాయకులు మల్లికను అభినందించారు.

Read More

మానవత కెరీర్ గైడెన్స్ .

పాలకొల్లు: ఫిబ్రవరి,6 (తెలుగు న్యూస్ పవర్) దిగమర్రు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సందర్భంగా, వారి ప్రతినిధులు పాల్గొని, విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ గురించి వివరించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి, తమ కలలు నిజం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభావంతులైన 8,9,10 విద్యార్థులకు మానవతా సంస్థ వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోట శ్రీనివాస్, చాముకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read More

9వ తరగతికి,మార్చి 12 నుంచి పదవ తరగతి పాఠాలు.

అమరావతి: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలోని అన్ని ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాల బోధన ప్రారంభిస్తారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విద్యాసంబంధ విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో చర్చలు ఫలించి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు, మార్చి 12 నుంచి 10వ తరగతి పాఠాలు నేర్పించడానికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నో…

Read More

ఘనంగా భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక పెదచెరువు వద్ద వేయించేసి ఉన్న శ్రీశ్రీశ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, స్వామివారికి పంచామృత ఫల రసాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. తమలపాకులు,సింధూరంతో సహస్రనామార్చన జరిగింది. భక్తాంజనేయ స్వామి వారికి శాంతి కల్యాణం చేశారు. ఈ వార్షికోత్సవ, అభిషేకపూజా కార్యక్రమానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. ఆలయ చైర్మన్ కాసా సత్యనారాయణ, బండారు రాధాకృష్ణ, ఆకుల భాస్కరరావు, ఆకుల నరసింహారావ,…

Read More

భీమవరం మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదాన పథకానికి సుంకర వారి భూరి విరాళం.

భీమవరం: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, మహిమాన్విత మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన వితరణకు శుక్రవారం భూరి విరాళం భక్తులు సమర్పించుకున్నారు. కీర్తిశేషులు, సుంకర శ్యామల బ్రహ్మాజీరావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఒక లక్ష 12వేల రూపాయల నగదు దేవస్థానం వారికి అందజేశారు. ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ దాతలకు వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహాలక్ష్మి నగేష్ భక్తులకు అమ్మవారి చిత్ర…

Read More

ముంచుకొస్తున్న ఏ ఐ ముప్పు

విజయవాడ: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) వేగంగా ముంచుకొస్తున్న ఏఐ ముప్పు వల్ల, సాఫ్ట్వేర్ కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. అంత్రోపిక్ , క్లాడ్ ఐటీ రంగంలో ఉన్న వారికి సుపరిచితమైనది. ఇటీవల ఒక ఏ ఐ ఆటోమేషన్ టూల్ విడుదల చేసింది. ఇందులో 11 రకాల ఓపెన్ సోర్స్, ప్లగ్ఇన్స్ ప్రవేశపెట్టింది. ప్లగ్గిన్స్ అంటే ప్రస్తుతం వాడుతున్న మూల సాఫ్ట్వేర్ కు అనుబంధగా ఉండి, వాటి సామర్థ్యాన్ని మరింత విస్తృత పరుచడానికి ఈ ప్లగ్గిన్స్…

Read More

కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాలకు అర్హులు -కమిషనర్ విజయ సారథి

పాలకొల్లు: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిష్టాత్మకంగా జరుప తలపెట్టిన సమీకృత కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ బి విజయ సారధి, గురువారం తన ఛాంబర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే లో నమోదైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. సర్వే జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ సర్వే ప్రారంభించినట్టు వెల్లడించారు. పట్టణంలో…

Read More

నిజాయితీకి సూపర్ స్టార్ రజినీకాంత్ సత్కారం.

చెన్నై: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్)సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను సత్కరించారు. చెన్నై టీ నగర్ లో రోడ్డు పక్కన పట్టించుకోకుండా పడి ఉన్న 45 సవర్ల బంగారు ఆభరణాలు, విధి నిర్వహణలో ఉండగా పద్మ కంట పడ్డాయి. వెంటనే వాటిని పై అధికారులకు ఆమె అందజేసాశారు. పాండి బజార్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సుమారు 45 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు సొంతదారులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ కే…

Read More