Telugu News Power

ప్రధాని పిలుపుమేర కు కేంద్రమంత్రి వర్మ మెట్రోలో ప్రయాణం.

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన అధికారిక కాన్వాయ్‌ను వదిలి దిల్లీ మెట్రోలో శనివారం ప్రయాణించారు. ఈ సందర్భంగా, వర్మ మాట్లాడుతూ, మనం ఆదా చేసే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్ — భారతదేశానికి ఆదా చేసిన విదేశీ మారక ద్రవ్యం లోటు భర్తీ చేస్తుందన్నారు. మెట్రోలో ప్రయాణించే ప్రతి కిలోమీటర్ — మన ఆర్థిక వ్యవస్థకు బలం, మన పర్యావరణానికి…

Read More

ఈనెల 20న మందుల షాపులు బంద్.

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే బందుకు ప్రజలు సహకరించాలని పశ్చిమగోదావరి జిల్లా సంఘ అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. మందుల షాపుల యజమానులు, సిబ్బంది ఈ ఆందోళన కార్యక్రమంలో తప్పక పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ రోజు కొన్ని మందుల షాపులు తెరిచి ఉంచుతామని భరోసా…

Read More

రైతు కుటుంబాల ఆనందానికి కూటమి ప్రభుత్వం అండ. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల కుటుంబాల్లో ఆనందానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో రూ. 5.15 కోట్ల నిధులతో జరుపు తలపెట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తెల్లపూడిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 46’లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ. 8,965 కోట్ల రూపాయలు…

Read More

ఆక్వా రంగ సంక్షోభానికి కూటమి ప్రభుత్వ బంధుప్రీతే కారణం. మాజీ ఎమ్మెల్యే ముదునూరి తీవ్ర ఆరోపణ.

నరసాపురం: మే, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వ బంధుప్రీతి,ఆశ్రితపక్షపాతం వల్లే ఆక్వా రంగం సిండికేట్ల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుందని నర్సాపురం మాజీ ఎమ్మెల్యే, విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఆక్వా రైతు నాయకుడు ముదునూరి ప్రసాద్ రాజు తీవ్రంగా ఆరోపించారు.కూటమి ప్రభుత్వం వచ్చాక వివిధ రంగాలు సంక్షోభంలో ఉండగా ఇప్పుడు ఆక్వారంగాన్ని కూడా సంక్షోభంపాలు చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం 10వ స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర జి డి…

Read More

రొయ్యల మేత ధర పెంచలేదు ఆక్వా రైతు సంఘ స్పష్ఠీకరణ.

పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) రొయ్యల మేత ధర పెంచలేదని,ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని స్థానిక జై భారత్ క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం సమావేశంలో అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు స్పష్టం చేశారు. మేత ధర విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అప్సడా సమావేశం మంత్రి అచ్ఛెo నాయుడు హాజరు కాకపోవడం వల్ల ఏ నిర్ణయం తీసుకోకుండా ముగిసిందని వెల్లడించారు. ఎక్కడైనా…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో స్వచ్ఛంద కార్యక్రమం.

పాలకొల్లు: మే 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రా” సాధనే ముఖ్య అజెండాగా ఎన్.ఎస్.ఎస్ I, II యూనిట్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, ప్లాస్టిక్ మహమ్మారి వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం, మూగజీవాల ప్రాణాలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో చండి హోమం.

భీమవరం: మే, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సన్నిధిలో వైశాఖ బహుళ అమావాస్య సందర్భంగా శనివారం ఆలయ అర్చకులు మరియు వేదపండితులు చండీహోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 92 మంది దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు వుదీసి మీనాక్షి, గుసిడి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.

భీమవరం: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం తో…

Read More

కేంద్ర మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ దగ్గుబాటి. పురందేశ్వరి.

లోక్‌సభ స్పీకర్ మహిళా సాధికారత కమిటీ (2026-27)ని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఆంధ్ర ప్రదేశ్, రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు డాక్టర్ డి. పురందేశ్వరి నియమితులయ్యారు. లోక్‌సభ సభ్యులు (18 మంది): డాక్టర్ డి. పురందేశ్వరి, స్మత్. లవ్లీ ఆనంద్, స్మత్. డి.కె. అరుణ, స్మత్. హర్సిమ్రత్ కౌర్ బాదల్, స్మత్. శోభనాబెన్ మహేంద్రసింహ్ బరాయియా, మిస్. ఇక్రా చౌదరి, స్మత్. కృతి దేవి డెబ్బర్మన్, కుమారి ప్రియాంక సతీష్ జార్కిహోలి, డాక్టర్ కాడియమ్…

Read More

కోనసీమ తిరుమలకు కోటి నిధులు.

ఆత్రేయపురం: మే,15(తెలుగు న్యూస్ పవర్.కామ్) కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. రుడా ఈ నిధులు సమకూర్చింది. నిధులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలం నుంచి స్వామివారి ఆలయం వరకు తారు రోడ్డు వేస్తారు. కాంక్రీట్ బేస్ నిర్మాణం, ఆలయం నుంచి ఏటిగట్టు వరకు తారు రోడ్డు వేయటానికి ప్రతిపాదించారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు…

Read More