Skip to main content

Telugu News Power

సిండికేట్ల గలాటా తో, రేవు పాట వాయిదాల పర్వం.

యలమంచిలి: జులై, 16( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అబ్బిరాజుపాలెం సోంపల్లి మధ్య గోదావరి నదిపై పై ఫంటు నడుపుకోవడానికి నిర్వహించ తలపెట్టిన వేలం పాట ప్రక్రియ గురువారం మరోసారి బెడిసికొట్టింది. అధికారులు ముచ్చటగా మూడోసారి వేలంపాట వాయిదా వేయగలిగారు. ప్రభుత్వం నీవు పాటకు రూ. 13 లక్షలు అప్సర్డ్ ప్రైస్ గా నిర్ణయించింది. పాటదారులు రూ. 7.50,8.10,10 లక్షల వరకు చెల్లించటానికి మూడు జరిగిన రేవు పాట సందర్భాల్లో ఆసక్తి చూపించారు. మండల అభివృద్ధి…

Read More

డిగ్రీ విద్యార్థులకు ఆనర్స్ డిగ్రీ కోర్సులపై అవగాహన సదస్సు.

పాలకొల్లు: జూలై,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు హానర్స్ డిగ్రీ కోర్సులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎం వి ఎన్, జే ఎస్ అండ్ ఆర్ వి ఆర్ డిగ్రీ కళాశాల, మలికిపురం, పొన్నపల్లి శ్రీరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరు విద్యార్థుల నిర్దేశించి మాట్లాడుతూ, తమ లక్ష్యసాధనకు అంకుటిత దీక్షతో,…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుక.

భీమవరం: జూలై,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం కి చెందిన భీమనాధం భాస్కరరావు జ్ఞాపకార్థం వారి భార్య జయలక్ష్మి నాలుగు గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల్ ఆంజనేయ ప్రసాద్…

Read More

ముద్రగడకు యలమంచిలి మండలంలో ఘన నివాళి.

య లమంచిలి: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండలంలోని మేడపాడు సెంటర్లో పలువురు నాయకులు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి,, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతికి బుధవారం ఘన నివాళులు అర్పించారు. ముద్రగడ కాపుల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేశారని వక్తలు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆయన తన జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తిని ప్రశంసించారు. ఆయన బాటలో నడిచిన ముద్రగడ బలహీన వర్గాల వారు స్త్రీల సమస్యల పరిష్కారం కోసం…

Read More

ముంబయి ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.

ముంబై: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కోకిల ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స అనంతరం బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరికి కుడి భుజం దెబ్బతిన్న కారణంగా శాస్త్ర చికిత్స జరిగింది. వీరు నేరుగా హైదరాబాద్ లోని నివాసానికి చేరు కొంటారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ ప్రారంభిస్తారని. వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం…

Read More

కాపు ఉద్యమ నేత ముద్రగడకు ఘన నివాళి.

పాలకొల్లు: జూలై, 15 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు స్థానిక పట్టణ ప్రముఖులు, ముద్రగడ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు కాపు జాతి ఐక్యత కోసం ముద్రగడ చేసిన సేవలను కొనియాడారు. పాలకులతో…

Read More

రాజకీయ ముసుగు వెయ్యొద్దు రొయ్యల రైతుల పైన. -జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఖండన.

పాలకొల్లు: జూలై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతు సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలకు వంత పలుకుతున్నారన్న వైసీపీ నాయకుల విమర్శను జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. వైసిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం సభకు హాజరవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం తగదు అన్నారు. విమర్శలు చేసిన నాయకులు అసలు ఆక్వా రైతుల కాదని వివరించారు. అందువల్ల ఆక్వా రైతులు కష్టసుఖాలు వారికి…

Read More

పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. -జనసేన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల

కైకలూరు: జులై,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన చర్చా వేదిక కార్యక్రమం కైకలూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం,…

Read More

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎమ్ ఓ, చంద్రశేఖర్ తనిఖీ.

యలమంచిలి: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాల లను పర్యవేక్షించుటలో భాగంగా మంగళవారం దొడ్డిపట్ల,, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జిల్లా ఏ ఎం ఓ సిహెచ్ చంద్రశేఖర్, యలమంచిలి మండలం ఎంఈఓ 1 జి వీరస్వామి సందర్శించారు.పాఠశాలలోని మౌలిక వసతులు లేబరేటరీ ,లైబ్రరీ ,స్కౌట్ అండ్ గైడ్స్, కిచెన్ గార్డెన్ ,కంపోస్ట్ ఫిట్ , రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,రైన్ వాటర్ హార్వెస్టింగ్…

Read More

ముగిసిన ముద్రగడ శకం కాపు ఉద్యమ నేతగా కీర్తి శిఖరాలుకు.

కాకినాడ: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కాపు ఉద్యమ నేతగా ఉభయ రాష్ట్రాల్లో కీర్తి గడించారు. కాపుల…

Read More