Telugu News Power

ఇసుక రవాణా బందుతో ఇబ్బందులు.

జెసి రాహుల్ రెడ్డి వినతిపత్రం సమర్పిస్తున్న రాజా

పాలకొల్లు, డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) ఇసుక తరలించే టిప్పర్ లారీల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. అక్రమ వసూళ్లు, కేసులు, కఠినమైన నిబంధనలు లారీల యాజమాన్యాలను అవస్థలపాలు చేస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం టిప్పర్ లారీల పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు రావురి రాజా, జెసి రాహుల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తిప్పల్లారీ యజమానుల సమస్యలను పరిష్కరించాలని రాజా విజ్ఞప్తి చేశారు.