పాలకొల్లు:ఆగస్టు,4( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ అధ్యక్షులు వై. యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, దగాపడిన యువతకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టాలని తీర్మానించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 6 నుంచి 9 వరకు నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు, 10న భారీ నిరసన ర్యాలీలు జరపాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమoలో, మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు,స్టేట్ సెక్రటరీ, యడ్ల తాతాజీ, చిలుకూరి దత్తాత్రేయ వర్మ ,పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, యలమంచిలి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్,పాలకొల్లు మండల అధ్యక్షులు పెనుమత్స యేసు రాజు, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, జిల్లా ఎస్ టీ సెల్ అధ్యక్షులు బండి రమేష్, స్టేట్ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి కర్రజయసరిత, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు వార్డు,గ్రామ అధ్యక్షులు మండల గ్రామ వివిధ అనుబంధ కమిటీ సభ్యులు మహిళలు యువత,విద్యార్థి లు ఈ సమావేశం లో పాల్గొన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వైసిపి దీక్షలు. ఈనెల 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు. ఈ నెల10న భారీ నిరసన ర్యాలీ.
నిరసన దీక్షలో గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న దృశ్యం