Skip to main content

Telugu News Power

మండల పరిషత్ సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష.

యలమంచిలి: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం, అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదని ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అధికారుల నుంచి అందకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సమన్వయ లోపం ఏర్పడిందని ఆరోపించారు. ఈ సమావేశంలో 18 శాఖలకు సంబంధించి అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. మండల అభివృద్ధి అధికారి జె డి వి ప్రసాద్, పంచాయతీరాజ్ ఏఈ నాగేశ్వరరావు, ఎంఈఓ ఆకుల శ్రీ వేణి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మండల పరిషత్ సమావేశం నిర్వహిస్తున్న ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్