పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ధర్మారావు ఫౌండేషన్ వారి సేవ కార్యక్రమాల్లో భాగంగా, మూడు రద్దీ ప్రదేశాల్లో మజ్జిగ చలివేంద్రాలు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం ప్రారంభించారు. వివిధ కారణాలతో పట్టణానికి వచ్చే బాటసారులకు వేసవి తీవ్రత దృష్ట్యా దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా స్థానిక గాంధీ బొమ్మల సెంటర్, పెద గోపురం, ఛాంబర్స్ కాలేజీ ఆర్చ్ దగ్గర ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మంత్రి స్వయంగా బాటసారులకు మజ్జిగ పంచారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏం సి చైర్మన్ కోడి విజయభాస్కర్, పెద గోపురం చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఉన్నమట్ల కపర్తి, బోనం చినబాబు, కర్నేని గౌర్నాయుడు, గండేటి వెంకటేశ్వరరావు, ధర్మకర్త భవాని, తాళ్ల నాగరాజు, ధనాని సూర్యప్రకాష్, పొట్నూరి శ్రీనివాస్, తదితర పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
