పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్)
నియోజకవర్గం లో నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 76 మందికి రూ. 66.42 లక్షలు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పరుగులు కూటమి నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
