న్యూ ఢిల్లీ: జులై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు , ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు తో కలిసి నర్సాపురం ఎంపీ, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బుధవారం కలిసారు.
వచ్చేనెల 1న జరగనున్న ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొట్టుకొమ్మ కానుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారానికి, మద్దతుకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం
ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం