Skip to main content

Telugu News Power

ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం రావాలి. -మొగల్తూరు సభలో ముఖ్యమంత్రి ఆకాంక్ష

ప్రజా వేదిక కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రజా వేదిక సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

దేశంలోనే నెంబర్ వన్ ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు,

మినీ హార్బర్ నిర్మాణం,

కాళీపట్నం భూములకు పట్టాలు

మహిళల ఉచిత ఏసి బస్సులు
-సీఎం హామీలు.

నియోజకవర్గ సమస్యలు విన్నవిస్తున్న నాయకర్

నర్సాపురం / మొగల్తూరు: సెప్టెంబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పేదల సేవలో, ప్రజా వేదిక కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బొమ్మిడి నారాయణ నాయకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే, ప్రజలందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. అందుకోసమే, పి- ఫోర్ పధకం ఊపిరి పోసుకుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా, మార్గదర్శి- స్వర్ణ కుటుంబంలో 1 లక్షా 7 వేల మంది మార్గదర్శకులు,11 11 లక్షల స్వర్ణ కుటుంబాలను దత్తత తీసుకున్నాయన్నారు. ఇంకా 22 లక్షల కుటుంబాలకు ఈ ప్రయోజనం అందవలసి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కలెక్టర్ సమన్వయం చేసుకుని వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి సి. ఎస్. ఆర్. నిధులు తెచ్చి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తపన, తన అనుభవం, ప్రధాని మోడీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. పేదలందరికీ కనీస అవసరాలు అయినా ఇల్లు, మంచినీళ్లు వంటి సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 5. 91 ఒక లక్షల ఇళ్లకు గాను 5.27 వేల ఇల్లు ఇప్పటికీ పూర్తయ్యాయన్నారు. మరోవైపు లక్షల ఇళ్ల నిర్మాణం జరగవలసి ఉందన్నారు. కరువు సీమకు, అనారోగ్య బాధితులకు నీరు అందించటం ఎంతో సంతృప్తినిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. హంద్రీనీవా, వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా నీరు తరలించే భగీరథ ప్రయత్నం చేసి ఫలితాలు ప్రజలకు అందజేస్తున్నామన్నారు. తాను ముఖ్యమంత్రిగా తొలిసారి1995 సెప్టెంబర్, 1న ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి దేశంలోనే వినూత్నమైన పథకాలు చేపట్టినట్టు వెల్లడించారు. ప్రజలను చైతన్య పరిచే అనే కార్యక్రమాలు చేశామన్నారు. ప్రజల వద్దకు పాలన, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ అమలులోనికి తెచ్చామన్నారు. సైబరాబాద్ నిర్మించి ఐటి రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలుపేమన్నారు. మహిళలకు డ్వాక్రా సంఘాలు, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండింగ్ సృష్టించామన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం కల్పించమన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చామన్నారు. గొడ్డలి పార్టీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతుందన్నారు. డీఎస్సీ జరక్కుండా 350 కేసులు వేసి అడ్డుకోవాలని చూసిన 16 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గుంటలు పార్టీలపై 30 వేల కోట్లు ప్రజల నుంచి అదనంగా వసూలు చేసిందన్నారు. సుమారు లక్షన్నర కోట్ల రూపాయల అప్పులతో విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచకుండా తగ్గించిందని గుర్తు చేశారు. ఆక్వా రైతులకు రూ.1200 కోట్ల సబ్సిడీ ఇస్తున్నామన్నారు. దేశంలోనే నెంబర్ వన్ గా ఆక్వా యూనివర్సిటీ ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మినీ హార్బర్ ఏర్పాటు, పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాళీపట్నంలో 5 వేల మందికి జమీందారీ భూములకు పట్టాలో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పింఛను ప్రవేశపెట్టిన ఒక పురుషుడు ఎన్టీఆర్ అన్నారు. పింఛను 4వేల రూపాయలు నుంచి 15 వేల రూపాయల వరకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. సాధించిన దానికి సంతృప్తి చెందితే ప్రగతి ఉండదని, ప్రజలు గుర్తించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మడి నాయకర్ మాట్లాడుతూ, సుమారు 9కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పర్యాటక రంగాల్లో అభివృద్ధి పరచాలని కోరారు. జాతీయ రహదారి 216 పై తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్డుని వెడల్పు చేయించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ,భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటం ప్రభుత్వం నీటిపారుదల రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వెలిగొండ పోలవరం ఎడమ కాలువ ద్వారా కృష్ణ, గోదావరి జలాలను పరవళ్ళు తొక్కిస్తుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవానికి నందమూరి తారక రామారావు ప్రతీక అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువారి ఆత్మవిశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. అనేక సాహసోపేతమైన సంస్కరణలకు ఆ అధ్యుడు అని కొనియాడారు. సైబరాబాద్ ను సృష్టించిన అపర త్రిసుంకుడిగా చంద్రబాబును అభివర్ణించారు. ఈరోజు గ్రామాల్లో ప్రజలకు వారి బిడ్డల ఐటీ ఉద్యోగాల వల్ల గడుస్తుందని వెల్లడించారు. ఈ వేదిక వద్ద ముఖ్యమంత్రి శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఇతని సత్యనారాయణ, గోలిశెట్టి శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు చంద్రబాబు నాయుడు కు బ్రహ్మరథం పట్టారు. వారు చూపిన ఆత్మీయ అభిమానానికి ముఖ్యమంత్రి ఫిదా అయ్యారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, సమర్థవంతంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కితాభించారు. పుష్కరాలు సందర్భంగా నరసాపురంలో మంత్రి పుష్కర ఘాట్లను పడవలో ప్రయాణించి స్వయంగా పరిశీలించారు.

ప్రజావేదిక సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి వర్మ
మత్స్యకార పించనుదారులతో ముఖ్యమంత్రి పడవలో మాటామంతి