Telugu News Power

Telugu News Power

సైబర్ భద్రత పై చాంబర్స్ కళాశాలలో ముగిసిన శిక్షణ.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆధ్వర్యంలో శనివారం స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద వైయస్సార్సీపి శ్రేణులతో కలిసి పాప పరిహార పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని మాజీ ముఖ్యమంత్రి జగన్ పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. ఇటీవల సిబిఐ ఇచ్చిన నివేదికలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి…

Read More

అంబటి అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) మాజీ మంత్రి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజంలో నిలబడే అర్హత కూడా లేదని, స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. స్థానిక కాజ పడమర గ్రామంలో సుమారు 50 లక్షల వ్యయంతో దిగమర్రు వరకు వేయనున్న రోడ్డు పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై…

Read More

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ…

Read More

అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన.

యలమంచిలి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక చించినాడ గ్రామంలో దాదాపు కోటి రూపాయలు నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపనలు చేశారు. మంచినీటి పథకానికి 5 లక్షలు, వడ్డిలంక ఛానల్, సిమెంట్ గోడ నిర్మాణానికి, దాదాపు 40 లక్షలు, అప్రోచ్ పనులకు దాదాపు 50 లక్షల తో మైనర్ డ్రైన్ పై కల్వర్టు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి, రుద్రరాజు సత్యనారాయణ రాజు, మామిడి శెట్టి…

Read More

పింఛను పదనిసలు

పాలకొల్లు: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, ఎన్టీఆర్ భరోసా పింఛను లు శనివారం స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, పూలపల్లి లో రజకుడు వెంకటేశ్వరరావును పరామర్శించారు. అతని కాలు గత కొన్ని నెలలుగా, చీము పట్టి దెబ్బతిన్నట్టు తెలుసుకొని, మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫోన్ లో వైద్యులు ఉండి అప్పారావును సంప్రదించి, వారికి మెరుగైన వైద్యం అందించవలసిందిగా కోరారు. అతని మందుల ఖర్చులు భరిస్తానని…

Read More

దాణా ధర పెంపు పై రొయ్యల రైతుల తీవ్ర ఆందోళన.

పాలకొల్లు: జనవరి, 31(తెలుగు న్యూస్ పవర్) రొయ్యల దాణా ధర పెంపు ఆలోచన ఫై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, జై భారత్ క్షీరా రామ రైతు సంఘం అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రొయ్యల ఫీడ్ ధరలు పెరగవచ్చుననే సమాచారం బయటకు పొక్కడంతో, రైతులు అత్యవసర కార్యవర్గ సమావేశం పూలపల్లిలో,శనివారం ఏర్పాటు చేశారు. గతంలో, దాణాకు వాడే ముడి సరుకుల ధరలు బాగా తగ్గినందున, ఆమేరకు ఫీడ్ ధర కనీసం 20 రూపాయలు,…

Read More

ఓటు హక్కు, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి – మై భారత్ జిల్లా అధికారి సుంకర.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జై భారత్ జిల్లా అధికారి సుంకర రాము పిలుపునిచ్చారు. స్థానిక ఆద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో, జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ, ఓటు విలువ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవడం వల్ల సుస్థిరమైన బాధ్యతా యుతమైన…

Read More

రిపబ్లిక్ డే అవార్డు గ్రహీతలకు సత్కారం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి చైతు మీదగా అవార్డులు అందుకున్న పలువురు ఉత్తమ ఉద్యోగులను శుక్రవారం ఎన్జీవో సంఘ నాయకులు, సంబంధిత శాఖల సహోద్యోగులు సత్కరించారు. మెడికల్ సూపరిండెంట్, యర్ర మాధురి, ఏం సత్యవతి, కె ముత్యాల వల్లి, వై మెర్లిన్, కే రమేష్, బి సుబ్రహ్మణ్యం సత్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడాల హరిబాబు, కే బి కే రమేష్ రెడ్డి, గుబ్బల ప్రసాద్, ఆర్ సుజాత,…

Read More

రఘు బాబు ఆకస్మిక మృతి, విషాదంలో పాలకొల్లు.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజారు సెంటర్లో వేంచేసి పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ గురుస్వామి, సోదరులు రఘు గురుస్వామి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. వీరి మరణం పాలకొల్లును విషాదంలో నింపింది. గురుదేవులు, ఎస్టిపివి ఆచార్యుల కుమారులు వీరు. ఎందరికో ఆత్మీయ బంధువు. భక్త జనుల కోసం ఎంతగానో తరితిపించిన నిస్వార్థ దైవ భక్తులు. స్థానిక గజలక్ష్మి ప్రాంతంలో అప్పటికప్పుడు, ఏర్పాట్లు చేసి, అయ్యప్ప స్వామి వారి…

Read More

పాఠశాలకు 3.60 లక్షలు మంజూరు.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక 31వ వార్డు, వడలివానిపేట ప్రాథమిక పాఠశాల, మరుగుదొడ్ల నిర్మాణానికి, మంత్రి నిమ్మల రామానాయుడు 3.60 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఈ పనులకు శుక్రవారం కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కాపర్తి, అన్నదాన సత్రం కమిటీ సభ్యులు సత్యనారాయణ, పలువురు కోటి నాయకులు పాల్గొన్నారు.

Read More