శ్రీ మావుళ్ళమ్మ కు రూ. 25 లక్షల హుండి కానుకలు.
భీమవరం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణం లోని ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి హుండీలు తెరచి బుధవారం లెక్కించారు. గడచిన 26 రోజుల కాలానికి, హుండీల ద్వారా రూ. 25,63,619/- రూపాయలు భక్తులు మావుళ్ళమ్మ కు కానుకలుగా సమర్పించుకున్నారు. బంగారం 30.200 గ్రాములు, వెండీ 55 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరిచారు. కాకినాడ పట్టణం…