Telugu News Power

Telugu News Power

తాళాబత్తులకు ఘనసత్కారం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, నటినట సంక్షేమ సమాఖ్య, తాళబత్తుల వెంకటేశ్వరరావుకు జరిగిన సత్కారం గురించి సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు,పాలకొల్లు ముద్దుబిడ్డ రచయిత,కళాభిమాని,కళాకారుడు, నాటక సంస్థ ప్రతినిధిగా ఎన్నో ఏళ్లుగా కళామతల్లి సేవలో తరిస్తున్న, తాళ బత్తుల వెంకటేశ్వరరావుకు, గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కళామందిరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న భారతరంగ్ మహోత్సవ్ అంతర్జాతీయ నాటకోత్సవాల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన, సత్కారం అందుకున్నారు….

Read More

యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.

యలమంచిలి; ఫిబ్రవరి,8 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరులు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం యలమంచిలి మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లిలో 3కోట్ల 55 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రక్షిత మంచినీటి పథకం పనులకు 66.40 లక్షల రూపాయలు, ఏటిగట్టు గ్రావెల్ రోడ్డు 2.52 లక్షలు, విలేజ్ హెల్త్ క్లినిక్ కు 36 లక్షల పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. శిరగాలపల్లిలో రైతులకు నూతన క్యూ…

Read More

చించినాడ నుంచి అంతర్వేదికి భక్తుల పాదయాత్ర.

యలమంచిలి: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) ,శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అంతర్వేది క్షేత్రానికి భక్తులు పాదయాత్ర చేశారు.. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం, చించినాడ గ్రామం నుంచి, అంతర్వేది క్షేత్ర దర్శన పాదయాత్ర ఆదివారం ఘనంగా జరిగింది. తొలిసారి. ప్రారంభించిన ఈ పాదయాత్రలో . వందల మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సుమారు రెండు గంటల సాగింది. భక్తులు ఆంజనేయస్వామి, జెండా చేపట్టి,వివిధ దేవుళ్ళ నామస్మరణ చేస్తూ…

Read More

ఉండి రైతులకు 28 లక్షలతో ఉచిత స్ప్రేయర్లు పంపిణీ.

ఉండి: ఫిబ్రవరి, 8 (తెలుగు న్యూస్ పవర్) ఉపసభావతి, మాజీ ఎంపీ, స్థానిక శాసనసభ్యులు, కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద జరిగిన కార్యక్రమంలో 400 మంది రైతులకు ఉచితంగా బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఐ సి ఏ ఆర్- భారతీయ వరి పరిశోధనా సంస్థ, హైదరాబాద్ వారి సౌజన్యంతో 28 లక్షల విలువైన ఈ ప్రేయర్ లో రైతులు అనుకున్నారు. రైతులు ఆధునిక, సాంకేతిక వ్యవసాయ…

Read More

వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ పై కార్మికలోకం హర్షం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ నిర్ణయం పై ప్రభుత్వానికి, స్థానిక శ్రీ వెంకటేశ్వర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక సంఘ కార్యాలయ భవనంలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో హర్షం ప్రకటించారు. ఈ సమావేశానికి పెచ్చెట్టి బాబ్జి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చొరవతో, కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ కృషి వల్ల బోర్డు మళ్లీ జీవం పోసుకోవడం తమకు…

Read More

కాపు విద్యార్థులకు స్కాలర్షిప్

పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిభ గల పేద కాపు విద్యార్థులకు, ఉపకారవేతనాలు అందజేస్తున్న తులసీ రామచంద్ర ప్రభు ను, స్థానిక మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు, లయన్స్ క్లబ్ స్థాపకులు, త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ బాబ్జి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీఐ కే. రజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రతిభకు, పేదరికం అడ్డు కాదన్నారు. విద్యార్థులు ఈ స్కాలర్షిప్ సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో…

Read More

యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ హెల్త్ క్యాంప్

పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ, స్థానిక మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద గల హర్ష మెడి ల్యాబ్ సంయుక్తంగా, ఆదివారం, స్థానిక టౌన్ హాల్ వద్ద, షుగర్, బిపి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 125 కి పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. స్థానిక బస్ స్టేషన్ వద్ద, ఈ శిబిరం ద్వారా ఎక్కువ మందికి సేవలు అందించాలని చూసినప్పటికీ స్థానిక ఆర్టీసీ అధికారులు…

Read More

పాలకొల్లు ఛాంబర్ కు నూతన సారధులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిష్టాత్మక పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో, అధ్యక్షులుగా, , కారుమూరి వెంకట రామ నరసింహారావు ఎంపికయ్యారు. వీరిది హ్యాట్రిక్ విజయం. కోకోనట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, కటారి నాగేంద్ర కుమార్, ఛాంబర్ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికయ్యారు. వీరికి ఇది రెండో విజయం. ఛాంబర్ కోశాధికారిగా, మామిడి బాబు వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. నూతన సారధులను పట్టణ ప్రముఖులు, స్థానిక…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ, స్వర్ణమయ, స్వర్ణ నిధి పథకానికి, స్థానిక భక్త దంపతులు, గోంట్ల వెంకట రామారావు, వెంకట లక్ష్మి సత్యవతి ఆదివారం బంగారం కానుకగా సమర్పించుకున్నారు. లక్ష 17 వేల రూపాయల విలువైన, 8 గ్రాముల బంగారాన్ని అమ్మవారికి, ఆలయ అధికారుల ద్వారా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఈ పుణ్య దంపతులకు, వేద ఆశీర్వచన పూజలు చేసి,…

Read More

కొంగు బిగించి, ట్రాఫిక్ సమస్యపై కొరడా జులిపించిన కలెక్టర్.

భీమవరం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) పట్టణ ప్రజలు, విద్యావంతులు, దుకాణదారులు ట్రాఫిక్ సమస్య పట్ల అవగాహనతో వ్యవహరించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా భీమవరం పట్టణాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనంపై ఆమె పట్టణంలో, ఎస్పీ, అద్నాన్ నయీమ్ అస్మి, అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భద్రత వారోత్సవాలు వంటి అనేక సందర్భాల్లో ఈ సమస్యపై అవగాహన కల్పించినప్పటికీ, ఫలితాలు రాలేదన్నరు….

Read More