Telugu News Power

Blog

కాపు విద్యార్థుల ఉపకార వేతనం కొరకు దరఖాస్తులు.

పాలకొల్లు: జనవరి,2 (తెలుగు న్యూస్ పవర్) తులసి సీడ్స్ అధినేత, కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తులసి రామచంద్ర ప్రభు, గుంటూరు వారి సౌజన్యంతో కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఏట అందిస్తున్నారు. ఈ ఏడాది, విద్యార్థుల నుంచి ఇందుకుగాను దరఖాస్తులు కోరుతున్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం, స్థానిక కాపు కార్తీక్ వన సమారాధన కమిటీల ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ల ఎంపిక జరుగుతుంది. విద్యార్థులు 75శాతం…

Read More

నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో సాయికుమార్ ప్రతిభ

పాలకొల్లు: జనవరి, 2(తెలుగు న్యూస్ పవర్) నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, డిసెంబర్,22- 28 వరకు జరిగింది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు, మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఈ క్యాంపు నిర్వహించారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థి క్యాంపులో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం తరుపున, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థి సాయికుమార్ కళాశాలకు గుర్తింపు తీసుకువచ్చినందుకు కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మరింత ఉన్నత స్థానానికి…

Read More

నరసాపురంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలు

నరసాపురం: జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రుస్తుంబాద శ్రీ గోగులమ్మ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు వచ్చే నెల 14 నుంచి 18 వరకు జరుగుతాయని కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ తెలిపారు. ఈ కబడి పోటీలు పురుషుల టీములు, మహిళల టీములు పాల్గొంటాయి. ఇక్కడ జరిగే పోటీలకురాష్ట్రవ్యాప్తంగానేకాక, దేశవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ ఉంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పోటీలు దశాబ్దాలు సమర్థవంతంగా, నిర్విరామంగా నిర్వహిస్తున్నరు.

Read More

నేడే సావిత్రిబాయి పూలే జయంతి జరపాలి.

పాలకొల్లు; జనవరి,2(తెలుగు న్యూస్ పవర్) సావిత్రిబాయి పూలే,భారతదేశంలో మొట్టమొదటి, బడుగు బలహీన వర్గాల,మహిళా ఉద్యమ, ఉపాధ్యాయురాలు. ఈమె జయంతి శనివారం నిర్వహించాలని యు టి ఎఫ్ సంఘం ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేసింది. సావిత్రిబాయి పూలే, చిత్రపటాలు అందుబాటులో ఉంచుకోవాలని కోరింది. ఈ పుట్టినరోజు జరిపేటప్పుడు పాఠశాల పని గంటలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సంఘం సూచించింది. కార్యక్రమం నిర్వహించి, ఫోటోలు గ్రూపులో పెట్టాలని కోరింది.

Read More

కొత్త ఏడాదికి స్వాగతం.

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) ఆంగ్ల సంవత్సరాది ప్రారంభ రోజు, గురువారం ఉదయం నుంచి సెంటిమెంటుగా, దేవాలయాలు కుటుంబ సమేతంగా, పసిబిడ్డలతో సహా తరలి రావడంతో భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక పెద్ద సాయిబాబా గుడి వద్ద, పండగ మొత్తం అక్కడే జరిగినట్టు, విభూది వేసిన రాలనంత మంది భక్తులతో మధ్యాహ్నం దాదాపు మూడు గంటల వరకు దర్శనం కోసం భక్తులు బారులుతీరి ఉన్నారు. దాదాపు 15 వేల మందికి పైగా దర్శించుకున్నట్టు దేవాలయం వర్గాలు అభిప్రాయం వ్యక్తం…

Read More

కళ్యాణోత్సవ తొలి సమావేశం

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పార్వతీ సమేత క్షీరరామలింగేశ్వర స్వామి వారు, శ్రీ లక్ష్మీ సమేత జనార్ధన స్వామివార్ల కళ్యాణోత్సవ ఏర్పాట్లపై, గురువారం తొలి సమావేశం,అభిషేక మండపంలో జరిగింది. వచ్చే మార్చి ,27న నుంచి ఈ కల్యాణ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిపై తొలి సమావేశం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, పాల్గొన్నారు.

Read More

పెండ్యాల భవాని కి సత్కారం

పాలకొల్లు: జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి లో ధర్మకర్తగా పెండ్యాల భవాని నియమితులైనారు. ఈ సందర్భంగా, గురువారం, క్షీరా రామలింగేశ్వర ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, పినిశెట్టి చిన్న, ఉప్పులపు, భవానీని సత్కరించారు. అర్చకులు అనిల్, క్రిస్టప్ప, ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణయ్య, వీరబాబు, సోమేశ్వరరావు పలువురు ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది…

Read More

ఎన్ జి ఓ నేతగా ముచ్చర్ల శ్రీనివాస రావు

పాలకొల్లు, జనవరి,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు తాలూకా, ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షులుగా ముచ్చర్ల శ్రీనివాస రావు ఇటీవల ఎంపి అయ్యారు. ప్రస్తుతం వీరు క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా వీధుల్లో నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ముచ్చర్ల శ్రీనివాసరావును ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు, వారి సిబ్బంది అభినందించి,సత్కరించారు. పాలకొల్లు తాలూకాలో, పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మండలాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల…

Read More

గత ఏడాదిపై ఓ విశ్లేషణ

పాలకొల్లు:డిసెంబర్,31(తెలుగు న్యూస్ పేపర్) రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఘర్షణ కొనసాగుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచంపై ప్రభావం చూపుతూనే ఉంది. ఇజ్రాయిల్-గాజా సంక్షోభం ప్రస్తుతానికి ముగిసింది. ప్రపంచ రాజకీయ ముఖచిత్రంపై అస్థిరత మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. భారతదేశం దౌత్యపరంగా కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే విదేశాల్లో ఉన్న భారతీయులను పలుదేశాలు తిప్పి పంపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా. అమెరికా వలసదారులను సంకెళ్లు వేసి వెనక్కి పంపడం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి తీరని మచ్చ గా మిగిలింది….

Read More

నూతన సంవత్సర కోలాహలం

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పవర్) పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రజలు సంబరపడ్డారు. నేడు జరగనున్న నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి, స్థానిక మిఠాయి దుకాణాల్లో ప్రజలు రద్దీగా కనిపించారు. ముగ్గులు, పూలు పళ్ళు అమ్మే దుకాణాల వద్ద సందడి కనపడింది. రోడ్డుపక్క ఏర్పాటు చేసిన బిర్యాని దుకాణాల వద్ద జనం ఎగబడ్డారు. ఈ సందర్భంగా పెనుమదం రోడ్డు, ఎడ్ల బజారు సెంటర్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఈ…

Read More