Telugu News Power

Blog

ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగుల అర్జీలు స్వీకరించిన కలెక్టర్.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 15 అర్జీలు స్వీకరించి నట్టు తెలిపారు. ఆరోగ్యం, పెన్షన్, ఉపాధి, బ్యాంకు రుణాలు వంటి సమస్యలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించాలని,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసియున్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా, చండీహోమం జరిగింది.దేవస్థానo అర్చకులు, వేదపారాయణలు ఘనంగా హోమం నిర్వహించారు. ఈ హోమం పూజలో 60 మంది పైగా దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, వుదిసి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Read More

సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు. -నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్.

నరసాపురం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ నెల 13న నరసాపురం మండలం, సీతారాంపురం సౌత్ గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద జరిగిన ర్యాలీని ఉద్దేశించి, కొందరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్‌లో అభ్యంతరకరమైన పోస్టులు మరియు వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఉన్న ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ, మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద చట్టం-2015 మరియు ఐటి చట్టం-2000 లోని సంబంధిత సెక్షన్ల కింద…

Read More

ఇంటర్మీడియట్ విద్యార్థుల అభినందన సభ.

పాలకొల్లు: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో పాలకొల్లు ఛాంబర్స్ జూనియర్ కాలేజి విద్యార్థులు విశేష ఫలితాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జీ గురువారంతెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో ఎంపిసి విభాగంలో అడబాల భవ్య తేజశ్రీ 1000 మార్కులకు గాను 987 మార్కులను, బైపిసి విభాగంలో బాలం తేజస్విని 987 మార్కులు సాధించి పాలకొల్లు టౌన్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఎంఇసి విభాగంలో రెడ్డి యర్రంనాయుడు 964…

Read More

జై భీమ్ యువసేన రూ. 48 వేలు సాయం.

యలమంచిలి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నార్ని మెరక శివారు గమళ్ళపెంటకు చెందిన జై భీమ్ యువసేన ఫౌండేషన్, యలమంచిలి లంకకు చెందిన చెవ్వేటి ప్రణీతకు రూ. 48 వేల రూపాయల సహాయం గురువారం అందజేశారు. ఈమెకు తల్లి లేదు. తండ్రి దివ్యాంగుడు. ప్రణీత ప్రస్తుతం బిఎస్సి నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నది. విషయం తెలుసుకు జై భీమ్ యువసేన ఫౌండేషన్ వారు ఫీజుల నిమిత్తమై అవసరమైన పూర్తి మొత్తం ఫౌండేషన్ ద్వారా అందజేశారు….

Read More

కూటమి ప్రభుత్వం బీసీలకు మద్దతు.

నర్సాపురం: ఏప్రిల్ ,16(తెలుగు న్యూస్ పవర్. కం) బీసీల కోసం ఎవరు ఉద్యమాలు చేసిన వారధిస్తామని నర్సాపురం శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకర్ మాట్లాడుతూ, బీసీ నాయకులు స్వప్రయోజనాల కోసం, ఎవరు ప్రేరేపిస్తే చేసే ఉద్యమాలకు బీసీలు ఎవరు మద్దతు తెలపరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ బీసీల పక్షపాతిగా ఉన్నట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ బీసీలకు…

Read More

మెగా ఫ్యామిలీ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు.

హైదరాబాద్: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాంచరణ్, నీహారిక వ్యక్తిగత జీవితాలను స్టాండప్ కామెడీ పేరిట కించపరుస్తూ అనుదీప్ కటికాల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తూ, అనుదీప్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనార్ కలిసి ఫిర్యాదు చేసినట్టు అఖిలభారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు రవణం స్వామి నాయుడు, తెలంగాణ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ గురువారం…

Read More

రేషన్ కార్డు సమస్యల పరిష్కారం అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) చాలా కాలంగా, రాష్ట్రం లో రేషన్ కార్డుదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ కార్డు దారులకు 9 సేవలు సులభంగా అందుకోవడానికి మార్గం సుగమం చేసింది. కొత్త రేషన్ కార్డు, కుటుంబ సభ్యులు చేర్పు, సభ్యుల తొలగింపు, కార్డులు కుటుంబాల ద్వారా విభజించడం, చిరునామా వివరాల మార్పు, కార్డు పోగొట్టుకున్న వారికి మరో కార్డు ఇవ్వడం, ఆధార్ తో లింక్ చేయటం, సెల్ ఫోన్ నెంబర్…

Read More

సైప్రస్ చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించిన వైశాలి. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు.

అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)భారత్ నారి శక్తి ఖండాంతరాలలో తమ సత్తా చాటుతున్నది. భారత మహిళలు ప్రతి రంగంలో నారి శక్తి, ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తున్నది.ఈ జాతీయ మార్పును ప్రతిబింబించేలా, ఆర్ వైశాలి సైప్రస్‌లో గురువారం ఎఫ్ ఐ డి ఇ- అంతర్జాతీయ ఛెస్ ఫెడరేషన్ నిర్వహించిన చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించారు. మహిళల వరల్డ్ ఛెస్ చాంపియన్‌షిప్‌కు సవాలు విసిరే స్థాయికి ఎదిగిన మొదటి భారతీయ మహిళగా ఆమె చెస్ చరిత్ర లో…

Read More

శ్రీ మావుళ్ళమ్మ నిత్యాన్నదాన వితరణకు షెడ్డు ఏర్పాటు. -ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభం

భీమవరం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి నిత్య అన్నప్రసాద వితరణకు నిర్మించిన షెడ్డు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షులు పులపర్తి రామాంజనేయులు గురువారం ప్రారంభించారు. ఈ వేసవి పరిస్థితుల దృష్ట్యా, భక్తుల సంక్షేమ, సౌకర్యాల కొరకు తాత్కాలికంగా అద్దె ప్రాతిపదికన, మహాపుణ్యాత్ములు యేరుబండి ఆదియ్య కుటుంబీకుల స్థలంలో అన్నప్రసాద వితరణ కొరకు తాత్కాలిత షెడ్డు…

Read More