Skip to main content

Telugu News Power

రాష్ట్రస్థాయిలో జిల్లాకు3వ స్థానం

జిల్లా కలెక్టర్ల చదలవాడ నాగరాణి

అమరావతి:మే,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవలపై జరిగిన సమీక్షలో జిల్లా నాల్గవ త్రైమాసికంలో 75.9 శాతం స్కోరు సాధించి రాష్ట్రంలో మూడో స్థానం దక్కించుకుంది. ఐ వి ఆర్ ఎస్, సర్వేలో అన్నా క్యాంటీన్లు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఆరోగ్య సేవలు, పింఛన్లు, పారిశుధ్యం, విద్యుత్ సేవలు వంటి అనేక రంగాల్లో జిల్లా మెరుగైన పనితీరు కనబర్చింది. అధికారులు సమిష్టిగా పనిచేయడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని కలెక్టర్ తెలిపారు.