భీమవరం:మే,27(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం నిధికి భీమవరం కు చెందిన అరిగే అనిల్ కుమార్ సాయి ప్రవల్లిక దంపతులు చి”వేదాన్ష్ మాన్విత్ చి”పార్కవి మాన్వి పేరుమీద శ్రీ అమ్మవారికి సుమారు రూ.2.30 లక్షలు విలువ కల 16 గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు. వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు ఆశీర్వచనాలు నిర్వహించగా, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ దాతలకు శేషవస్త్రం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందచేసారు
శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి రూ.2.30 లక్షల కనకపు కానుక.
శ్రీమావుళ్ళమ్మ వారి చిత్రపటం స్వీకరిస్తున్న భక్తులు