Telugu News Power

బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం

బ్లడ్ గ్రూపింగ్ గురించి వివరిస్తున్న దృశ్యం.

యమంచిలి: డిసెంబర్,1(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులచే నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం సోమవారం బ్లడ్ గ్రూపింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ప్రజలకు బ్లడ్ గ్రూపింగ్ గురించి వివరించారు. కి అవగాహన కార్యక్రమంలో పాలకొల్లు లయన్స్ రూరల్ క్లబ్, ఆపద్బాంధవుడు బ్లడ్ బ్యాంక్, సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి అనురాధ, డాక్టర్ ఎస్.వి.రంగారావు, శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం రామకృష్ణ, డాక్టర్ వి విజయలక్ష్మ, పాల్గొన్నారు. ఎయిడ్స్ డే సందర్భంగా అడవి పాలెం లో చెరుకూరి అంజిబాబు, ఎన్ఎస్ వాలంటీర్లు ,ప్రోగ్రాం ఆఫీసర్ ఎయిడ్స్ నిరోధక ర్యాలీ నిర్వహించారు.