Telugu News Power

క్షీరారామం దర్శించుకున్న ప్రముఖులు

సత్కారం అందుకుంటున్న జిల్లా అదనపు జడ్జ్ ఏ.వాసంతి

పాలకొల్లు:డిసెంబర్,5 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని శనివారం ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ మరియు అడిషనల్ డిస్టిక్ట్ జడ్జ్ ఏ.వాసంతి స్వామివారిని దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ.వో ముచ్చర్ల శ్రీనివాస్ సాలుతో సత్కరించారు. ప్రధానఅర్చకులు, క్రిష్టప్ప, అనిల్ వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి .సూర్య ప్రకాష్, తహసిల్దార్ దుర్గా కిషోర్, సూపర్డెంట్ పి.వాసు,పాలకొల్లు జోన్ విఆర్ఓ సుబ్బారావు మరియు ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్వామి వారిని దర్శించుకున్న సమాచార కమిషనర్ సునీల్