Telugu News Power

క్షీరా రామలింగేశ్వర ఆలయంలో విఘ్నేశ్వర పూజ.

పూజలు చేస్తున్న భక్తులు

పాలకొల్లు డిసెంబర్ 9 తెలుగు న్యూస్ పవర్ వారం వారం జరుగుతున్న సప్త మారేడు దళముల ప్రదక్షణలు పూర్తి చేసుకున్న 15 మంది భక్త దంపతులు విగ్నేశ్వర పూజలో పాల్గొన్నారు. శివ సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, పర్యవేక్షకులు పి వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.