ఆచంట:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఇప్పటికే ఎంతోకాలంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని యుటిఎఫ్ జిల్లా నాయకులు పోలిశెట్టి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్ స్కూల్లో మండల శాఖ కార్యవర్గ సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. రాష్ట్ర కౌన్సిలర్ కేతా వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ ఆయా చట్టాలు సవరించాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలో అమలవుతున్న , సెలవులు లేని ప్రణాళికల అమలు వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతు న్నారన్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ప్రసాద్, కార్యదర్శి ఆర్ కమలనాథ్, ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఆఫీస్ బెర్రర్లు 16, జిల్లా కౌన్సిల్ 40మంది, ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.