పాలకొల్లు:డిసెంబర్,26 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామిని శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సురేష్ కుమార్ దంపతులు దర్శించి,పూజలు చేశారు. కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో, శేష వస్త్రం బహుకరించి సత్కరించారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.