తిరుపతి: మే, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్, భార్య అనురాధ తో కలిసి సతీసమేతంగా ఆదివారం తిరుమల లోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల దేశంలో మినీ ఎన్నికల మాదిరి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్ల దగ్గర నుంచి ఫలితాలు విరోధించే వరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అయినప్పటికీ అత్యంత సమర్థవంతంగా ఎన్నికల విధులు ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో ఈసారి జరిగిన ఎన్నికలు దేశ ఎన్నికల చరిత్రలో రికార్డు స్థాయిలో 90 లక్షల ఓట్లు తొలగించారు. ఇది ఎలక్షన్ కమిషన్కు సాహసోపేతమైన చర్య. ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారి తన విధి నిర్వహణలో సక్రమంగా నిర్వహించే శక్తినిచ్చిన వెంకటేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న, ప్రధాన ఎన్నికల అధికారి.
శ్రీవారి సేవలో ఎన్నికల అధికారి జ్ఞానేశ్ దంపతులు