Telugu News Power

శ్రీలంక పర్యటనలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ బిజీ.

శ్రీలంక పర్యటనలో మండలి బృందం

శ్రీలంక: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీలంక పర్యటనలో డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే, అభినవ ఆంధ్రభోజులు మండలి బుద్ధ ప్రసాద్ వివిధ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు. కొలంబో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుద్ధప్రసాద్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి నిత్యానందరావు, రిజిస్ట్రార్ హనుమంతరావు, డి.విజయభాస్కర్, అనురాధ ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. వారికి శ్రీలంక తెలుగు కాంగ్రేస్ అధ్యక్షులు అన్బూజగన్, కలవి భూషణ్, రత్న ప్రభృతులు ఆత్మీయ స్వాగతం పలికారు.