Skip to main content

Telugu News Power

ఘనంగా పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ శంకుస్థాపన.

జిల్లా పార్టీ కార్యాలయ భవన శంకుస్థాపన చేస్తున్న రామరాజు దంపతులు

భీమవరం: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యాయానికి నాంది పలికేలా
ఉండి నియోజకవర్గంలోని గొల్లలకోడేరు గ్రామంలో జిల్లా టీడీపీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఉండి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐఐసీ చైర్మన్, మంతెన రామరాజు( రాంబాబు) సతీష్ సమేతంగా శంకుస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మార్గదర్శకత్వంలో టీడీపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలనే లక్ష్యంతో ఈ నూతన జిల్లా కార్యాలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా నిర్మించనున్న ఈ కార్యాలయం కేవలం పార్టీ కార్యకలాపాలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసే ప్రజా వేదికగా నిలవనుంది.
యువతను పార్టీతో మరింత అనుసంధానం చేస్తూ, సాంకేతికతను వినియోగించుకుంటూ పార్టీని ఆధునికంగా, మరింత చురుకుగా తీర్చిదిద్దడంలో నారా లోకేష్ నాయకత్వం, ఆలోచనా విధానం మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ శంకుస్థాపన కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు, మాజీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ తోట సీతారామలక్ష్మి గారు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ , తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు (బాబ్జి) , నర్సాపురం ఇంచార్జి పొత్తూరి రామరాజు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎంమ్మెల్సీ అంగార రామ్మోహన్, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, మండల నాయకులు, అనుబంధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నెముక. వారి కృషి, అంకితభావం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతే పార్టీకి నిజమైన బలం. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడానికి ఈ కార్యాలయం ఒక ప్రధాన కేంద్రంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నూతన జిల్లా కార్యాలయం ప్రజా సేవకు, పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి చిరునామాగా నిలవాలని ఈ సందర్భంగా, ఆకాంక్షించారు.