
భీమవరం: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్.కామ్) భగవద్గీత గీతా పఠనం ద్వారా మనిషికి ఆత్మజ్ఞానం, సత్ప్రవర్తన అలవడతాయని, జన్మసాఫల్యం కలుగుతుందని శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం పేర్కోన్నారు. శ్రీగణపతి సచ్చిదానంద స్వామి వారి అనుగ్రహంతో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణంలో భాగంగా శనివారం భీమవరం శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో 1108 మహిళలచే సహస్ర గళ సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు వీవీఎస్ శర్మ మాట్లాడుతూ భగవద్గీత పారాయణం చేయడం వల్ల మనిషిలో మానసిక ప్రశాంతత, ధైర్యం ఏకాగ్రత పెరుగుతాయన్నారు. ఇది సకల పాపాలను తొలగించి, జీవితంలో సరైన కర్తవ్యాన్ని నిర్వర్తించే మార్గాన్ని చూపుతుందన్నారు. 1108 మంది మహిళలచే ముక్త కంఠంతో భగవద్గీత పారాయణం చేయడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఆలయ ధర్మకర్తలు, రామాయణం శ్రీనివాస్,వుదిసి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగశిరీష,కారెంపూడి ఆదిలక్ష్మి,అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం ,మల్లువలస లక్ష్మి నిర్మల,గొంతిన రమణ,యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపోలు ఏడుకొండలు, ఎక్స్ అఫీషియో మెంబర్ బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పాల్గొన్నారు.