Telugu News Power

Telugu News Power

పడిపోయిన కొబ్బరి ధరలు రాలిపోయిన రైతు ఆశలు

పాలకొల్లు, యలమంచిలి, నవంబర్, 24 ( తెలుగు న్యూస్ పవర్)కొబ్బరి రైతులను ఊహల పల్లకిలో ఊరేగించిన కొబ్బరి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. రైతులు, వ్యాపారులు ఇందువల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి ధర చిల్లర వ్యాపారస్తుల దగ్గర 35 నుంచి 40 రూపాయలు వరకు నడిచింది. రైతుకు 25 రూపాయలు వరకు ధర ముట్టింది. గత రెండు సంవత్సరాలుగా, నెమ్మదిగా పెరుగుతూ వచ్చి, గరిష్ట స్థాయికి చేరింది. అయితే ధర పతనం ఒక్క రోజులోనే కుప్పకూలిపోయినట్టు వ్యాపారులు…

Read More

యలమంచిలి లో మంత్రి నిమ్మలచే, తెలుగుదేశం పార్టీ భారీ ర్యాలీ.

యలమంచిలి:నవంబర్,23 (తెలుగు న్యూస్ పేపర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని మేడపాడు సెంటర్ నుంచి యలమంచిలి కళ్యాణ మండపం దగ్గర సభాస్థలి వరకు సాగింది. ర్యాలీలో మంత్రి మిమ్ములను గజమాలతో సత్కరించారు. మహిళలు ఎక్కడికక్కడ పూలజల్లులతో, హారతులు పట్టి స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టిపెద్దిరాజు, బోనం నాని,తెలుగు యువత అధ్యక్షులు బొప్పన రాంబాబు, తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి…

Read More

క్షీరారామంలో చండీయాగం

పాలకొల్లు: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) క్షీరా రామలింగేశ్వర స్వామి వారి యాగశాలలో ఆదివారం చండీ హోమం జరిగింది. ఆడిటర్ రామరాజువారి కుమారులు బలరామరాజు దంపతులచే ఈ హోమం భక్తిశ్రద్ధలతో పురోహితులు సూరిబాబు ఆధ్వర్యంలో జరిపించారు. పలురువు భక్తులు ఈ హోమాన్ని వీక్షించారు.

Read More

మెడికల్ కాలేజీల పి పి పి విధానంపై చర్చకు రావాలి- జడ శ్రవణ్ కుమార్ సవాల్

పాలకొల్లు: నవంబర్, 23 (తెలుగు న్యూస్ పవర్) కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పి పి పి విధానం లో వైద్య కళాశాల ఏర్పాటు ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందో ప్రజలకు వెల్లడించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని మాజీ న్యాయమూర్తి, జై భీమ్రావు భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రాబోయే 17 వైద్య కళాశాలలు పి పి పి పద్ధతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాల పరిరక్షణ…

Read More

భావిత తరాల కోసం నిరంతరం కష్టపడాలి మంత్రి నిమ్మల పిలుపు

యలమంచిలి: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మంత్రి మిమ్మల్ని రామానాయుడు పిలుపునిచ్చారు. యలమంచిలి మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ సభకు నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండి రాజకీయం కూడా చేయాలని కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి…

Read More

జగన్ నీటి లేఖపై నిప్పులు చెరిగిన- మంత్రి నిమ్మల

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ -2 ముందు వాదనలు వినిపించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ పై మంత్రి నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో శనివారం సాయంత్రం రాష్ట్ర జలవి వనరులశాఖమాత్యులు నిమ్మల రామానాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జగన్ ఆంధ్రరాష్ట్ర జలవనరులను తెలంగాణకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. మాజీ…

Read More

అయ్యప్ప భక్తులు ఉద్యమిస్తారు

పాలకొల్లు:నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తుల ఆగ్రహాన్ని కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎదుర్కోలేదని బిజెపి నాయకులు, రైల్వే కమిటీ సభ్యులు జక్కంపూడి కుమార్ పత్రికలకు విడుదల చేసిన తన వీడియోస్ సందేశంలో హెచ్చరించారు. కోట్లాది రూపాయల అయ్యప్ప భక్తుల నిధులను అందుకుంటున్న కేరళ ప్రభుత్వం, వ్యాపారాలు చేసుకొనే వారికి ఎంతో సొమ్ము చెల్లిస్తున్నా,భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. స్వామిని దర్శించుకునే భక్తులు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ, చలికి వణుకుతూ…

Read More

జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు నవంబర్ 22 తెలుగు న్యూస్ పవర్ జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ శనివారం పాలకొల్లు బ్రాడీపేట లో గల ఎంపీజే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు.వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి, ఆర్ వి ఎస్ గంగాధర శర్మ పాల్గొన్నారు.

Read More

యలమంచిలిమండల ఉపాధ్యాయ క్లస్టర్ సమావేశం.

యలమంచిలి: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన, క్లస్టర్ సమావేశం యలమంచిలి మండలంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈసారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వేరుగాను, పాఠశాల సహాయక ఉపాధ్యాయులకు వేరుగాను ఈ సమావేశాలు నిర్వహించారు. యలమంచిలి మండలంలో ఉన్న మొత్తం 4 క్లస్టర్లలో ఈ సమావేశాలు జరిగాయి. యమంచిలి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు క్లస్టర్ తో పాటు, స్కూల్ అసిస్టెంట్స్ క్లస్టర్ సమావేశం కూడా నిర్వహించారు. దాదాపు 300 మంది ఉపాధ్యాయులు ఈ…

Read More

త్వరలో టిడ్కో ఇళ్ళ గృహప్రవేశాలు – మంత్రి నిమ్మల

పాలకొల్లు: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్) పేదలు, మహిళలు ఎప్పుడా,ఎప్పుడా అని ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల గృహప్రవేశం కోసం ఇక తన దృష్టి కేంద్రీకరించి పనిచేస్తానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యుల నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో శనివారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయలు నిధులతో పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రగతినీ మంత్రి స్వయంగా ద్విచక్ర వాహనంపై، కూటమి నాయకులతో…

Read More