Telugu News Power

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణనిధికి రూ.55 వేల విరాళం.

భీమవరం: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి స్థానిక గన్నాబత్తుల వెంకట సోమేశ్వరరావు, సరోజిని దంపతులు సుమారు 55 వేలు విలవ చేసే 4 గ్రాముల బంగారం కానుకగా సమర్పించారు.వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసినారని, ఆలయ అసిస్టెంట్ కమిషనర్…

Read More

ఛాంబర్స్ జాబ్ మేళాలో 138 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: మార్చి,26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఎస్ ఎస్ డి సి మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ వారి సౌజన్యంతో జాబ్ మేళా గురువారం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో ఆశావహులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి…

Read More

ఉచిత వైద్య శిబిరంలో కళ్ళజోళ్ళు పంపిణి

పాలకొల్లు: మార్చి, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. స్థానిక రాజవల్లి రాధా రామన్ లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఈ శిబిరం నిర్వహించారు. కంటి చూపు పరీక్షలకు 160 మంది హాజరు కాగా, 112 మందికి మన్యం జగ్గమ్మ సత్రం వారు ఉచితంగా కళ్ళజోళ్ళు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి…

Read More

క్షయ వ్యాధి నివారణ పై అవగాహన శిబిరం.

పాలకొల్లు: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా, స్థానిక లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం అవగాహన నిర్వహించారు. టిబి విముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ నవ్య జీవన్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ, టీబీ వ్యాధిగ్రస్తులు 100 రోజుల్లో పూర్తిగా నయం చేసుకునే మందులు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి పట్ల ఆందోళన అవసరం లేదని, సకాలంలో, ఆసుపత్రిలో ఉచితంగా అందించే వైద్య…

Read More

వాకర్స్ క్లబ్ సహాయం.

పాలకొల్లు: మార్చి, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాకర్స్ క్లబ్, ఇద్దరు పేద విద్యార్థులకు బుధవారం, కొత్త కుళాయి చెరువు వద్ద, అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు సైకిళ్ళు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామరాజు లంక గ్రామం, ఉర్రింక మధు వర్షిని, నాగులంక గ్రామం, మండపాక సిద్దు దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లడానికి, 14 వేల రూపాయలతో ఈ సహాయం అందజేశారు. బట్టీలంక కు చెందిన ఇంటర్ విద్యార్థి బి.హాసినికి వైద్య…

Read More

దేవాలయాలకు 20 నెలల్లో 40 కోట్ల రూపాయలతో రోడ్డు సౌకర్యం కల్పించాం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

విజయవాడ/రామతీర్థం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతోపాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం వర్చువల్ గా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, సీతారాముని పేట కూడలి నుంచి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ కు రూ. 25 లక్షల హుండి కానుకలు.

భీమవరం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణం లోని ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి హుండీలు తెరచి బుధవారం లెక్కించారు. గడచిన 26 రోజుల కాలానికి, హుండీల ద్వారా రూ. 25,63,619/- రూపాయలు భక్తులు మావుళ్ళమ్మ కు కానుకలుగా సమర్పించుకున్నారు. బంగారం 30.200 గ్రాములు, వెండీ 55 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరిచారు. కాకినాడ పట్టణం…

Read More

పవన్ కళ్యాణ్ పై వేసిన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, టిక్కెట్ ధర పెంపులో నిబంధనలు పాటించలేదని, మేరకు విచారం జరిపించాలని పిటిషనర్ విజయ్ కుమార్ కోర్టుకు వెళ్లారు. వీరి తరఫున న్యాయవాది బి.బాలయ్య వాదించారు. అడ్వకేట్ జనరల్…

Read More

ఉత్తర అమెరికాకు ప్రత్యేక ప్రతినిధిగా మిరియాల శ్రీనివాస్ నియామకం.

అమరావతి, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రతినిధ్యం వహించేందుకు శ్రీ మిరియాల శ్రీనివాస్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి నంబర్ 632 ప్రకారం, ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

Read More

వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన.

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలం వెలివెల, ఆరట్లకట్ట గ్రామాల్లో ఆత్మ వారి సహకారం తో మంగళవారం రైతులకు సమావేశం ఏర్పాటు చేశారు. అగర్తి పాలెం లో వరి పాలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మారుటేరు శాస్త్ర వేత్తలు డాక్టర్ మల్లి కార్జునరావు మాట్లాడుతు వరి పంట పాలు పోసుకొనే దశ లో ఉన్నది ఉక్కబోత గా ఉంటుంది, కావున దోమ వచ్చే సూచన ఉంది, కాబట్టి రైతులు జాగ్రత్తగా పొలం…

Read More