Telugu News Power

కాపు విద్యార్థులకు స్కాలర్షిప్

పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిభ గల పేద కాపు విద్యార్థులకు, ఉపకారవేతనాలు అందజేస్తున్న తులసీ రామచంద్ర ప్రభు ను, స్థానిక మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు, లయన్స్ క్లబ్ స్థాపకులు, త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ బాబ్జి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీఐ కే. రజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రతిభకు, పేదరికం అడ్డు కాదన్నారు. విద్యార్థులు ఈ స్కాలర్షిప్ సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో…

Read More

యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ హెల్త్ క్యాంప్

పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ, స్థానిక మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద గల హర్ష మెడి ల్యాబ్ సంయుక్తంగా, ఆదివారం, స్థానిక టౌన్ హాల్ వద్ద, షుగర్, బిపి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 125 కి పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. స్థానిక బస్ స్టేషన్ వద్ద, ఈ శిబిరం ద్వారా ఎక్కువ మందికి సేవలు అందించాలని చూసినప్పటికీ స్థానిక ఆర్టీసీ అధికారులు…

Read More

పాలకొల్లు ఛాంబర్ కు నూతన సారధులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిష్టాత్మక పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో, అధ్యక్షులుగా, , కారుమూరి వెంకట రామ నరసింహారావు ఎంపికయ్యారు. వీరిది హ్యాట్రిక్ విజయం. కోకోనట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, కటారి నాగేంద్ర కుమార్, ఛాంబర్ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికయ్యారు. వీరికి ఇది రెండో విజయం. ఛాంబర్ కోశాధికారిగా, మామిడి బాబు వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. నూతన సారధులను పట్టణ ప్రముఖులు, స్థానిక…

Read More

కొంగు బిగించి, ట్రాఫిక్ సమస్యపై కొరడా జులిపించిన కలెక్టర్.

భీమవరం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) పట్టణ ప్రజలు, విద్యావంతులు, దుకాణదారులు ట్రాఫిక్ సమస్య పట్ల అవగాహనతో వ్యవహరించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా భీమవరం పట్టణాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనంపై ఆమె పట్టణంలో, ఎస్పీ, అద్నాన్ నయీమ్ అస్మి, అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భద్రత వారోత్సవాలు వంటి అనేక సందర్భాల్లో ఈ సమస్యపై అవగాహన కల్పించినప్పటికీ, ఫలితాలు రాలేదన్నరు….

Read More

ఉద్యోగుల బకాయలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను, యుటిఎఫ్ జిల్లా కమిటీ శనివారం కలిసారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయ,ఉద్యోగులకు ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవడానికి శాసనసభలో చర్చించాలని కోరారు. వేతన సవరణకు వెంటనే 12వ కమిషన్ వేయాలని కోరారు. చెల్లించవలసిన డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యంతర భృతి 29% వెంటనే అమలు చేసి చెల్లించాలని కోరారు….

Read More

పాలకొల్లు నియోజకవర్గం లో 110 కోట్లతో మంచినీటికి మహర్దశ.

పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) నియోజకవర్గ ఆడపడచులు రక్షిత మంచినీటి కోసం అడిగే వారిని, వారి ఆశీర్వచనంతో, అధికారంలోకి వచ్చిన, కూటమి ప్రభుత్వం, ఆ కల నెరవేర్చబోతుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నా రు. పోడూరు మండలం,వేడంగి గ్రామంలో 62.35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి పథకానికి, మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏ విధమైన కలుషితం చేరకుండా,…

Read More

వి బి- జి రామ్ జి పనులతో గ్రామాలకు మేలు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) గ్రామీణ ఉపాధి, స్వయం సమృద్ధి లక్ష్యంగా వి.బి- జి రామ్ జి పథకం అమలు జరుగుతుందని, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, స్థానిక మార్కెట్ కమిటీ, మాజీ చైర్మన్ ఉన్నమట్ల కపర్థి, శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ పథకం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40, నిధులతో పనులు చేయబడతారని తెలిపారు. రైతు, కూలీలు ఇరువురికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో,…

Read More

మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం,నాయకుల ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, మధ్యంతర భృతి, వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, సిపిఎస్ రద్దు వంటి ముఖ్య విషయాల పరిష్కారానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని హామీ…

Read More

9 కోట్ల బహుమతితో, విశ్వ గురు స్థానానికి ఇండియా ఉపాధ్యాయిని రౌబుల్ నాగి.

దుబాయ్: ఫిబ్రవరి, 6(తెలుగు pi న్యూస్ పవర్) దేశం గర్వించదగ్గ, భారతీయ విద్యావేత్త రౌబుల్ నాగి, విద్యారంగానికి సంబంధించి నోబెల్ బహుమతిగా భావించే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ అవార్డు-2026 అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆల్ ముక్తుమ్, జమ్స్ ఎడ్యుకేషన్, లండన్ కు చెందిన వేర్కి సంయుక్తంగా అవార్డు అందజేస్తున్నాయి. అవార్డు కింద 9 కోట్ల నగదు అందజేశారు. దుబాయిలో , వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో అవార్డు…

Read More

యూత్ క్లబ్ కొంతేరు పరిషత్ కు ఎంపికైన ఏడు నాటికలు.

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కొంతేరు యూత్ క్లబ్ తరపున గత 44 ఏళ్లుగా నాటకపరిషత్ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నాటకోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ పరిషత్తులో ప్రదర్శించడానికి ఏడు నాటికలు అర్హత పొందాయి. నాటికలు ఈ ఏడాది మే నెల 1 నుంచి 3 వరకు, మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు, క్లబ్ అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ వెల్లడించారు. 1.తితిక్ష బి వి కె క్రియేషన్స్, కాకినాడ, రచన: డి ఉమాశంకర్, దర్శకత్వం…

Read More