Skip to main content

Telugu News Power

పాలకొల్లు ఛాంబర్ కు నూతన సారధులు.

పాలకొల్లు ఛాంబర్ నూతన ప్రధాన కార్యదర్శిగా కటారి నాగేంద్ర కుమార్

పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిష్టాత్మక పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో, అధ్యక్షులుగా, , కారుమూరి వెంకట రామ నరసింహారావు ఎంపికయ్యారు. వీరిది హ్యాట్రిక్ విజయం. కోకోనట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, కటారి నాగేంద్ర కుమార్, ఛాంబర్ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికయ్యారు. వీరికి ఇది రెండో విజయం. ఛాంబర్ కోశాధికారిగా, మామిడి బాబు వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. నూతన సారధులను పట్టణ ప్రముఖులు, స్థానిక వ్యాపార వర్గాలు అభినందనలు తెలియజేశారు.